కాంట్రాక్టు ఉద్యోగులు 13,671 మందే: యనమల
మీ మంత్రే 32 వేల మంది ఉన్నారన్నారు
నిలదీసిన పలువురు సభ్యులు
సాక్షి, హైదరాబాద్: ‘కాంట్రాక్టు ఉద్యోగులందరినీ నేరుగా క్రమబద్ధీకరించాలంటే కుదరదు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఆ పరిధి మేరకు నడుచుకోవాలి. అయినా మేం క్రమబద్ధీకరణ విషయూన్ని పరిశీలిస్తున్నాం. దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తున్నాం’ అని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. సోమవారం శాసనసమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఆయన మాట్లాడుతూ తాము క్రమబద్ధీకరణ చేయలేమని అనట్లేదని, ఆ విషయం పరిశీలిస్తూనే ఉన్నామన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 13,671 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నట్లు చెప్పారు.
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తాము ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని, అందుకే ఈ అంశాన్ని పరిశీలించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులు వేరు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వేరని స్పష్టం చేశారు. సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగులు, ఐకేపీ ఉద్యోగులు కాంట్రాక్టు పరిధిలోకి రారని చెప్పారు.
మంత్రుల మధ్య విరుద్ధ ప్రకటనలా?
ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తారా? అంటూ పలువురు సభ్యులు రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి నేత ఆదిరెడ్డి అప్పారావు ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. కాంట్రాక్టు ఉద్యోగులపై మంత్రుల మధ్యే స్పష్టత లేదన్నారు. ఇదే సభలో కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు 32,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారని చెప్పారని, ఇప్పుడు ఆర్థిక మంత్రి 13,671 మంది మాత్రమే ఉన్నారని చెబుతున్నారని అభ్యంతరం తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా డెంగీ మృతులు ఇద్దరేనని ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించటాన్ని ఎమ్మెల్సీ గేయానంద్ సవాల్ చేశారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 42 మంది మృతి చెందారని, కావాలంటే నిరూపిస్తానన్నారు.
రాష్ట్రవాప్తంగా 40 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలుండగా 202 పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.
వక్ఫ్ భూములకు సంబంధించి 24 వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు.
నేరుగా క్రమబద్ధీకరించలేం
Published Tue, Sep 2 2014 2:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
షర్మిల ఆడియో లీక్
మాకు ఓటు వేయకుంటే కరెంట్ కట్: కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరింపు!
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
సింగర్ హత్య కేసు నిందితుడిపై కాల్పులు.. స్పాట్లోనే!
అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్
హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్
కైకేయి.. శూర్పణఖ... ఏదైనా ఓకే
జయహో జోయా
మన సర్పంచులు @ ఐరాస
కృష్ణమ్మతో సత్యదేవ్ స్టార్ అవుతాడు: రాజమౌళి
తప్పక చదవండి
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
Advertisement