సోమిరెడ్డి, రామచంద్రయ్య మధ్య వాగ్వాదం | Sakshi
Sakshi News home page

సోమిరెడ్డి, రామచంద్రయ్య మధ్య వాగ్వాదం

Published Tue, Mar 22 2016 12:54 PM

tdp mlc, congress mlc fire on each others

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఇసుక మాఫియాపై మంగళవారం వాడివేడిగా చర్చ జరిగింది.ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి... కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మీ ప్రభుత్వ హయాంలో ఇసుక దోచుకున్నారంటూ ఇరువురు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు సంధించుకున్నారు. దీంతో ఇరువురు సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మండలి ఛైర్మన్ చక్రపాటి జోక్యం చేసుకున్నారు. ఇరువురికి సర్థిచెప్పి.. చర్చను ముగించినట్లు చక్రపాటి ప్రకటించారు.

 

Advertisement
Advertisement