సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇప్పటివరకు తీసుకున్న చర్యలేంటో వివరిస్తూ సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు అమలు చేయడం లేదంటూ న్యాయవాది జె.కె.రాజు 2013లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు సంబంధిత అంశాల్లో నిజానిజాలను తేల్చాలంటూ ఒక పర్యవేక్షణ కమిటీని నియమించింది.
ఈ కమిటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అధ్యయనం జరిపి మౌలిక సదుపాయాలు లేని మాట వాస్తవమేనని, అయితే అంతకంటే ముందు పాఠశాలల్లో ఉపాధ్యాయులే లేరని సుప్రీంకోర్టుకు నివే దించింది. పాఠశాలల్లో ఉపాధ్యాయులే లేకపోతే ఎలా అంటూ సుప్రీంకోర్టు రెండు రాష్ట్రాలను గత అక్టోబర్లో ప్రశ్నించింది. వెంటనే టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. టీచర్ల భర్తీ తీరుతెన్నులపై అఫిడవిట్ దాఖలు చేయాలని నోటీసులు జారీచేసింది.
తాజాగా సోమవారం ఈ పిటిషన్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివకీర్తి సింగ్తో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణలో టీచర్ల భర్తీని జూన్ నెలాఖరులోగా పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది పాల్వాయి వెంకటరెడ్డి కోర్టుకు విన్నవించారు. భర్తీకి తీసుకున్న చర్యలేంటో సమగ్ర నివేదికతో అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ దీపక్ మిశ్రా ఆదేశించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందని, ఫలితాలు కూడా వెలువడ్డాయని, మరికొన్ని పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని ఆ రాష్ట్రం తరపున హాజరైన న్యాయవాది గుంటూరు ప్రభాకర్ విన్నవించారు. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు మార్చి 14కు వాయిదా వేసింది.
జవాబుదారీతనం ఎక్కడ?
ఇదే కేసులో తమ వాదనలు కూడా వినాలంటూ తెలంగాణ పేరెంట్స్ ఫెడరేషన్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. ఫెడరేషన్ అధ్యక్షుడు జె.సాగర్రావు తరపున న్యాయవాది కె.శ్రవణ్కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ‘‘గత అక్టోబర్లో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో 28,707 ప్రభుత్వ పాఠశాలల్లో 1,11,877 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అయితే విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం ఉపాధ్యాయులను డిప్యూటేషన్పై నియమించేందుకు వీల్లేదు. కానీ ఉపాధ్యాయులు శాసన సభ్యులకు వ్యక్తిగత సహాయకులుగా, ప్రత్యేక విధులు నిర్వర్తించే అధికారులు(ఓఎస్డీ)గా డిప్యూటేషన్పై విధులు నిర్వర్తిస్తున్నారు.
ఉపాధ్యాయులు సీఎం కార్యాలయంలో, మంత్రుల కార్యాలయంలో డిప్యూటేషన్పై విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఉపాధ్యాయుల వేతనాలపై నెలకు రూ.558.29 కోట్లు వెచ్చిస్తోంది. ఉపాధ్యాయుల వేతనాలు రూ.26 వేల నుంచి రూ.1.10 లక్షల వరకూ ఉన్నాయి. సగటున ఒక్కో ఉపాధ్యాయుడిపై రూ.50 వేలు ఖర్చు చేస్తోంది. 90 శాతం ఉపాధ్యాయులు తమకు కేటాయించిన గ్రామాల్లో నివాసం ఉండడం లేదు. అందువల్ల పాఠశాలలు సక్రమంగా నడవడం లేదు. యూనియన్ నేతలు ఆన్ డ్యూటీ పేరుతో వేతనాలు అందుకుంటున్నారు. కానీ తరగతులకు హాజరు కావడం లేదు. ఇలా జవాబుదారీతనం లేకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు సక్రమంగా నడవడం లేదు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. మరోవైపు ఫీజుల భారం భరించలేక రైతులు, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాల వ్యవస్థలో జవాబుదారీతనం ఉండేలా చూడాలి’’ అని పిటిషన్లో విన్నవించారు.
టీచర్ పోస్టుల భర్తీ ఏమైంది?
Published Tue, Feb 16 2016 3:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement