క్యాంప్ ఆఫీస్ చుట్టూ కాలినడకన కేసీఆర్ | Sakshi
Sakshi News home page

క్యాంప్ ఆఫీస్ చుట్టూ కాలినడకన కేసీఆర్

Published Thu, Nov 3 2016 4:37 PM

క్యాంప్ ఆఫీస్ చుట్టూ కాలినడకన కేసీఆర్ - Sakshi

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గురువారం కొత్త క్యాంప్ కార్యాలయ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. పంజాగుట్టలో సుమారు తొమ్మిదెకరాల్లో నిర్మిస్తున్న క్యాంప్ కార్యాలయం చుట్టూ కాలినడకన వెళ్లి... పనులకు సంబంధించి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ నిర్మాణానికి సంబంధించి పలు సూచనలు చేశారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు ఈ నెల 24న కొత్త క్యాంప్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగున్నాయి. ఇప్పటికే తొంబై శాతం పనులు పూర్తయినట్లు సమాచారం.

కాగా ప్రస్తుతమున్న క్యాంపు కార్యాలయంలో సమావేశాలు నిర్వహించుకోవడానికి, సందర్శకులను కలుసుకోవడానికి అనువుగా లేనందున కొత్త కార్యాలయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నూతన క్యాంప్ ఆఫీస్ పక్కా వాస్తు ప్రకారం నిర్మించారు. ఈ కార్యాలయంలో ఒకేసారి 500 మందితో సమావేశం అయ్యేలా ఏర్పాట్లు చేశారు. మినీ థియేటర్, కాన్ఫరెన్స్ హాల్, టెలీ కాన్ఫరెన్స్ లు నిర్వహించేలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు.

Advertisement
Advertisement