'ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు గురికావద్దు' | Sakshi
Sakshi News home page

'ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు గురికావద్దు'

Published Sat, Jan 16 2016 5:14 PM

Telangana election commissioner Nagireddy advise to hyderabad city people

హైదరాబాద్ : ఎన్నికలు అనేవి అవినీతి అరికట్టడానికి తొలిమెట్టు అని తెలంగాణ ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్లో నాగిరెడ్డి మాట్లాడుతూ... ప్రజల్లో అవినీతిపై చైతన్యరాహిత్యం ఉందని... అందువల్లే ఆ అంశాన్ని ముట్టుకోలేకపోతున్నామన్నారు.

ఎన్నికల్లోనే అవినీతి జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రలోభాలకు గురికావద్దు అని ప్రజలకు ఈ సందర్భంగా నాగిరెడ్డి హితవుపలికారు.  అలాగే ప్రతి ఒక్కరు ఓటుహక్కు వినియోగించుకోవాలని ప్రజలకు నాగిరెడ్డి సూచించారు.

Advertisement
Advertisement