తేల్చే బాధ్యత ఎస్కీకి అప్పగింత
సాక్షి, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఒకటో ప్యాకేజీలో చేపట్టే పంప్హౌస్ నిర్మాణ వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఉపరితల పంప్హౌస్కు బదులు భూగర్భ పంప్హౌస్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూగర్భ పంప్హౌస్ నిర్మాణం వల్ల రూ.300 కోట్ల మేర అదనపు వ్యయం అవుతుందని అధికారులు చెబుతుండగా, రూ.వెయ్యి కోట్లపైనే అని పలు పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో భూగర్భ పంప్హౌస్ భారాన్ని తేల్చే బాధ్యతను ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఎస్కీ)కి అప్పగించింది. ఒకటో ప్యాకేజీలో స్టేజ్-1 పంపింగ్ స్టేషన్ను రూ.3,224.33 కోట్లతో నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ పనులను కాంట్రాక్టు ఏజెన్సీలు రూ.3,208 కోట్లకు టెండర్ను దక్కించుకున్నాయి. అధికారులు ముందుగా ప్రతిపాదించిన పంపింగ్ స్టేషన్ కల్వకుర్తి పంపింగ్ స్టేషన్కు 1.25 కిలోమీటర్ల దూరాన తూర్పు ప్రాంతంలో ఉంది.
ఈ ప్రాంతంలో 287 ఎకరాల మేర అటవీ భూమి ఉన్న నేపథ్యంలో పంపింగ్ స్టేషన్ నిర్మాణస్థలాన్ని మార్చాలని కాంట్రాక్టు ఏజెన్సీ ప్రభుత్వానికి నివేదించింది. కల్వకుర్తి పంప్హౌస్కు 300 మీటర్ల దూరాన పశ్చిమాన నిర్మాణం చేయాలని, భూఉపరితలంలో కాకుండా భూగర్భంలో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి అనుమతించాలని కోరింది. ఇలా అయితే, భారం రూ.300 కోట్లు ఉంటుందని తేల్చగా, అటవీ, భూసేకరణ సమస్యలను తప్పిస్తున్నందున రూ.70 నుంచి రూ.80 కోట్లు మిగులుతాయని, ఈ లెక్కన అదనపు భారం రూ.50 కోట్లకు మించదని అధికారిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
భూగర్భ పంప్హౌస్తో భారమెంత?
Published Mon, Jul 18 2016 1:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
షూటింగ్... పార్టీయింగ్...
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement