తెలంగాణ న్యాయవాదుల ఉద్యమ బాట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ న్యాయవాదులు మరోసారి ఉద్యమ బాట పట్టనున్నారు. కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజన ప్రక్రియలో భాగంగా న్యాయాధికారుల కేటాయింపులకు సంబంధించి హైకోర్టు ఇటీవల విడుదల చేసిన ప్రాథమిక జాబితాను నిరసిస్తూ ఈ నెల 10వ తేదీ నుంచి తెలంగాణలోని అన్ని కోర్టుల్లో విధులను బహిష్కరించాలని నిర్ణయించారు. అన్ని కోర్టుల్లో ప్రాథమిక కేటాయింపుల జాబితా ప్రతులను తగులబెట్టి హైకోర్టుకు తమ నిరసనను తెలియజేయనున్నారు.
న్యాయంగా దక్కాల్సిన 40 శాతం వాటా మేర మొదట తెలంగాణ న్యాయవాదులు, న్యాయాధికారుల నుంచి హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయాల్సిందేనని పట్టుపడుతున్నారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం రెండు రోజుల క్రితం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పలు తీర్మానాలు చేసింది. అలాగే తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం అన్ని జిల్లా న్యాయవాద సంఘాల అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జేఏసీ కన్వీనర్ ఎం.రాజేందర్రెడ్డి, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గండ్ర మోహన్రావు, బార్ కౌన్సిల్ సభ్యుడు ఎం.సహోదర్రెడ్డి, పలు జిల్లా న్యాయవాద సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో తీర్మానాలు చేశారు.
కీలక తీర్మానాలు...
- మార్గదర్శకాలకు విరుద్ధంగా హైకోర్టు రూపొందించిన న్యాయాధికారుల కేటాయింపుల ప్రాథమిక జాబితాను ఉపసంహరించుకోవాలి.
- ఏపీ న్యాయాధికారులు తెలంగాణను ఎంపిక చేసుకుంటూ ఇచ్చిన ఆప్షన్ను వెనక్కి తీసుకునేలా కోరుతూ అన్ని కోర్టుల్లో బ్యానర్లు ఏర్పాటు చేయాలి.
- రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయ మంత్రి తదితరులను కలసి వినతిపత్రాలు సమర్పించాలి.
- న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.100 కోట్ల నిధిని సక్రమంగా వినియోగించేందుకు వెంటనే మార్గదర్శకాలు జారీ చేయాలి. అలాగే న్యాయవాదులకు హౌసింగ్ స్కీం కోసం కూడా మార్గదర్శకాలు జారీ చేయాలి.
- స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా అన్ని పోలీస్స్టేషన్లకు ఆదేశాలివ్వాలి. ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలి.
10 నుంచి కోర్టుల్లో విధుల బహిష్కరణ
Published Sun, May 8 2016 2:10 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
Yashika Aannand: అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషిక ఆనంద్ (ఫొటోలు)
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
పచ్చ మద్యం స్వాధీనం..
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- మా పిల్లల చదువులపై కుట్రలొద్దు బాబూ
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement