‘నవలకు నీరాజనం’లో యద్దనపూడిని కొనియాడిన వక్తలు
హైదరాబాద్: తెలుగు పాఠకుల హృదయ సామ్రాజ్ఞి యద్దనపూడి సులోచనారాణి అని వక్తలు కొనియాడారు. యువతలో కల్పనా భావం పెంపొందించేందుకు ఆమె రచనలు దోహద పడతాయని తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఎల్లూరి శివారెడ్డి పేర్కొన్నారు. ఐదు దశాబ్దాల కింద ఆమె రచించిన ‘సెక్రటరీ’ నవల సంచలనం సృష్టించి నేటికీ పాఠకుల మదిలో చిరస్థాయిగా నిలిచిందని కొనియాడారు. సెక్రటరీ నవల స్వర్ణోత్సవం సందర్భంగా లేఖిని మహిళా చైతన్య సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లోని శ్రీ త్యాగరాయ గానసభ లో జరిగిన ‘నవలకు నీరాజనం’ కార్యక్రమానికి శివారెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఓ నవల స్వర్ణోత్సవంతో పాటు 90 ముద్ర ణలకు నోచుకోవడం దేశ చరిత్రలోనే లేదని, సెక్రటరీ నవల ఈ ఘనతను తొలిసారిగా దక్కించుకుందని పేర్కొన్నారు. విశిష్ట అతిథి ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్ర మూర్తి మాట్లాడుతూ.. నేటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా, యువత మ నస్తత్వానికి అద్దంపట్టేలా అప్పట్లోనే సులోచనారాణి రచనలు చేశారని చెప్పారు. ఆత్మగౌరవంతో పాటు గౌరవప్రదంగా జీవించాలనుకునే మనస్తత్వమున్న పాత్రలు ఆమె రచనల్లో కనిపిస్తాయని పేర్కొన్నారు. సెక్రటరీ నవల 90వ ముద్రణను ప్రముఖ చిత్ర దర్శకుడు కె.విశ్వనాథ్ ఆవిష్కరించారు.
సులోచనా రాణి అనేక నవలలు సినిమాలుగా వచ్చినా, తాను మాత్రం ఆమె నవలలను సినిమాగా తీయలేకపోయానని చెప్పారు. పాఠకులు చూపిస్తున్న అభిమానానికి హృదయం ఉప్పొంగిపోతోందని సులోచనా రాణి పేర్కొన్నారు. ఒకప్పుడు రచయిత్రుల రచనలు అంతగా ప్రాచుర్యం పొందలేదని, సెక్రటరీ నవలతోనే రచయిత్రుల యుగం ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. ఒకానొక దశ లో రచయిత్రుల పేర్లతో నవలలు రాసే పరిస్థితి వచ్చిందన్నారు. 1965లో సీరియల్గా వచ్చిన సెక్రటరీ నవల అదే ఏడాది పుస్తకం గా వచ్చిందని, ఈ పుస్తకం 90 ముద్రణలకు నోచుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
రచయిత్రి వాసా ప్రభావతి మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాల కింద స్త్రీ మనసు ఏ ప్రేమను కోరుకుందో నేటి స్త్రీ మనసు కూడా అదే ప్రేమను కోరుకుం టోందని చెప్పారు. ఈ సందర్భంగా సులోచనారాణిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జ్యోతి మాస పత్రిక సంపాదకుడు లీలావతిరాఘవయ్య, ఎమెస్కో పబ్లిషర్ ధూపాటి విజయకుమార్, టీవీ సీరియల్ దర్శకురాలు మంజుల నాయుడు, సుధాకర్ పల్లమాల, మృణాళిని, కళాదీక్షితులు, ప్రముఖ నాట్య కళాకారిణి వింజమూరి సుజాత, పొత్తూరి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సభ ప్రారంభంలో స్నేహలత మురళి బృందం జానపద నృత్యం ఆహూతులను ఆకట్టుకుంది.
తెలుగు పాఠకుల హృదయ సామ్రాజ్ఞి
Published Mon, Jan 25 2016 4:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?: సీఎం జగన్
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement