హైదరాబాద్ : చట్టపరమైన రిజర్వేషన్లు కావాలని కాపు సామాజిక వర్గం సాగిస్తున్న ఉద్యమంపై అధికార తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం మొదలైంది. ఉద్యమాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంటే... మరోవైపు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరిగా డీల్ చేయలేదన్న భావన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ విషయంలో తొలి నుంచి దాటవేత ధోరణి ఇంతటి పరిస్థితికి తెచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తునిలో చోటు చేసుకున్న ఘటనలతో పాటు తాజాగా ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్టు ముద్రగడ పద్మనాభం ప్రకటించడంపై టీడీపీ నేతల్లో తీవ్ర చర్చ సాగుతోంది. రాజకీయంగా పార్టీకి ఈ పరిణామం ఒక పెద్ద దెబ్బగా ఆ పార్టీ నేతలు అంచనాకొచ్చారు. ఈ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కోవాలన్న తర్జనభర్జన సాగిస్తున్నారు. మరో వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పార్టీలో కొందరు సన్నిహిత నేతలు, కాపు సామాజిక వర్గ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తన క్యాంపు కార్యాలయానికి పిలిచి ఉద్యమానికి కౌంటర్ ఎలా ఇవ్వాలన్న దానిపై సమాలోచనలు జరిపారు.
కాపు రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు దగ్గరపడుతున్నా ఉద్యమం చేస్తామన్న ప్రకటన వెలువడిన తర్వాత కాపు కార్పొరేషన్ పదవిని భర్తీ చేయడంపై టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. ఒక సామాజిక వర్గంపై తక్కువ అభిప్రాయం, తప్పుడు అంచనాలే ఇంతవరకు తెచ్చాయని అంటున్నారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులందరినీ సమావేశపరిచి ఉంటే విషయం ఇంతదాకా వచ్చేది కాదని సీనియర్ నేత ఒకరన్నారు. పైగా రిజర్వేషన్లపై కమిషన్ ఏర్పాటు చేసే విషయంలో కాలయాపన చేయడం కూడా నష్టం తెచ్చిందని, ఇంతజరిగిన తర్వాత చట్టంలో ఉన్న ప్రతిబంధకాల గురించి ముఖ్యమంత్రి చెప్పడం ఆ సామాజిక వర్గాల్లో మరింత కోపం తెప్పించేదిగా ఉందని సొంత పార్టీ నేతలు మండిపడుతున్నారు.
కాపు ఉద్యమంతో ఇరకాటంలో టీడీపీ
Published Mon, Feb 1 2016 5:59 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
షర్మిల ఆడియో లీక్
మాకు ఓటు వేయకుంటే కరెంట్ కట్: కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరింపు!
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
సింగర్ హత్య కేసు నిందితుడిపై కాల్పులు.. స్పాట్లోనే!
అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్
హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్
కైకేయి.. శూర్పణఖ... ఏదైనా ఓకే
జయహో జోయా
మన సర్పంచులు @ ఐరాస
కృష్ణమ్మతో సత్యదేవ్ స్టార్ అవుతాడు: రాజమౌళి
తప్పక చదవండి
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
Advertisement