Sakshi News home page

క్రషర్‌లో పడి కార్మికుడి దుర్మరణం

Published Tue, Nov 22 2016 11:36 PM

The crusher worker killed in fall

ఆమనగల్లు: ప్రమాదవశాత్తు క్రషర్‌లో పడి కార్మికుడు మృతి చెందిన సంఘటన ఆమనగల్లు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సురేశ్‌యాదవ్‌ కథనం మేరకు ఒడిస్సాకు చెందిన ధర్మబోయి ఏడాదిగా స్థానిక అవుకు మినరల్స్‌లో పనిచేస్తున్నాడు. మంగళవారం అతను ప్రమాదవశాత్తు కన్వేయర్‌ బెల్ట్‌పై తీవ్రంగా గాయపడి దుర్మరణం చెందాడు. మృతుని సోదరుడు లక్షి్మదార్‌బోయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement