ఆ ఎనిమిది మంది రాలేదు | Sakshi
Sakshi News home page

ఆ ఎనిమిది మంది రాలేదు

Published Mon, Mar 14 2016 9:53 PM

ఆ ఎనిమిది మంది రాలేదు - Sakshi

హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ తరపున ఎన్నికై ఇటీవల టీడీపీలో చేరిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సోమవారం శాసనసభకు గైర్హాజరయ్యారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్, చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుపై ఉన్నఫళంగా అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చర్చకు అనుమతించిన నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలు శాసనసభకు రాక పోవడం చర్చనీయాంశమైంది.

వారు సోమవారం సభకు రాక పోయినా వారందరికీ సభకు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలని వైఎస్సార్‌సీపీ విప్ ఎన్.అమరనాథ్‌రెడ్డి విప్‌ను జారీ చేశారు.

Advertisement
Advertisement