- 13న చలో హైకోర్టుకు తరలిరండి
- అదే రోజున భవిష్యత్ కార్యాచరణ
- న్యాయవాద సంఘాల పిలుపు
సాక్షి, హైదరాబాద్: న్యాయాధికారుల కేటాయింపులకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనను విరమించాలని కోరేందుకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ దిలీప్ బి.బొసాలే చర్చలకు ఆహ్వానించారని, అయితే ఆ చర్చలు విఫలమయ్యాయని ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ అధ్యక్షుడు జితేందర్రెడ్డి తెలిపారు. తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గండ్ర మోహన్రావు, సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి, న్యాయవాద జేఏసీ కన్వీనర్ రాజేందర్రెడ్డి, సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిరావు, రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్రెడ్డిలతో కూడిన ప్రతినిధి బృందంతో ఏసీజే చర్చించారని జితేందర్రెడ్డి తెలిపారు. న్యాయాధికారుల ప్రొవిజినల్ జాబితాను రీకాల్ చేయాలని, హైకోర్టు నిబంధనల మేరకు కొత్త జాబితాను రూపొందించాలని తాము కోరామన్నారు.
కనీసం తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరామని, అయితే వినతిపత్రాన్ని పరిశీలిస్తామని మాత్రమే ఏసీజే చెప్పడంతో తాము వచ్చేశామని జితేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 13న చలో హైకోర్టు కార్యక్రమం చేపడతామని...రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు భారీ సంఖ్యలో ఇందులో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అదే రోజు న్యాయవాదులతో చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేసిన న్యాయాధికారుల కేటాయింపులను రద్దు చేసే వరకూ ఆందోళన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
కొనసాగుతున్న విధుల బహిష్కరణ
న్యాయాధికారుల ప్రిలిమినరీ కేటాయింపులను వెంటనే రద్దు చేయాలంటూ తెలంగాణవ్యాప్తంగా న్యాయవాదులు చేపట్టిన విధుల బహిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఐదో రోజూ కొనసాగింది. న్యాయవాదులకు మద్దతుగా భోజన విరామ సమయంలో పెద్ద ఎత్తున న్యాయశాఖ ఉద్యోగులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ జంట నగరాల పరిధిలోని అన్ని కోర్టుల్లోనూ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కాగా, న్యాయవాదులతో కలసి ఆందోళనల్లో పాల్గొనరాదని న్యాయాధికారులు, న్యాయశాఖ ఉద్యోగులను హైకోర్టు హెచ్చరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే కోర్టు విధులకు ఆటంకం కలిగించకుండా శాంతియుతంగా భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేస్తున్నా హైకోర్టు తమను బెదిరించే ప్రయత్నం చేస్తోందని న్యాయశాఖ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు వైఖరి ఇదే తరహాలో ఉంటే సమ్మెకు వెళ్లేందుకూ వెనుకాడబోమని వారు హెచ్చరిస్తున్నారు.
ఆప్షన్లను అంగీకరించొద్దు: ఎమ్మెల్యే రవీంద్ర
ఆంధ్ర ప్రాంత న్యాయాధికారులు తెలంగాణలో పనిచేయడానికి ఇచ్చిన ఆప్షన్లను అంగీకరించరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. అలాగే వారి కేటాయింపులతో కూడిన ప్రాథమిక జాబితాను వెంటనే నిలుపుదల చేయాలని ఒక ప్రకటనలో కోరారు. ఆంధ్ర ప్రాంతం నుంచి ఆప్షన్ల ద్వారా తెలంగాణలో పనిచేసే న్యాయాధికారుల వల్ల తెలంగాణ న్యాయాధికారుల పదోన్నతుల్లో అవరోధాలు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఈ అంశంపై న్యాయవాదులు చేపడుతున్న నిరసనలకు సంఘీభావం తెలిపారు.
హైకోర్టు ఏసీజేతో చర్చలు విఫలం
Published Sat, Jun 11 2016 1:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement