31 వరకు నామినేషన్ల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీ కాబోతున్న రెండు రాజ్యసభ స్థానాల భర్తీకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రం నుంచి ప్రస్తుతం సభ్యులుగా ఉన్న వి.హనుమంతరావు(కాంగ్రెస్), గుండు సుధారాణి(టీడీపీ/ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నారు) పదవీ కాలం జూన్ 21తో ముగుస్తుంది. ఈ ఖాళీల భర్తీకి ఎన్నికల కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం ఎన్నికల రిటర్నింగ్ అధికారి(ఆర్వో)గా నియమితులయ్యారు. ఆయన వివరాలు ప్రకటించారు. ఈ నెల 31 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్ 1న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 3వ తేదీ గడువు.
ఎన్నిక అనివార్యమైతే జూన్ 11న అసెంబ్లీలో పోలింగ్ నిర్వహిస్తారు. అయితే అధికార టీఆర్ఎస్ మినహా ఏ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశాలు దాదాపు లేవు. ఒక్కో రాజ్యసభ సభ్యుడి ఎన్నికకు 40 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం అవుతాయని లెక్క తేల్చారు. రెండు స్థానాల కోసం 80 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. కాంగ్రెస్ సహా ఏ ఇతర పక్షానికి, లేదా అన్ని విపక్షాలు కలిసినా ఒక్క సీటును కూడా గెలుచుకునే స్థాయిలో ఎమ్మెల్యేల సంఖ్య లేదు. ఫిరాయించిన ఎమ్మెల్యేలతో కలిపి టీఆర్ఎస్కు రెండు రాజ్యసభ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకోగలిగే బలం ఉంది.
రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
Published Wed, May 25 2016 3:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
Advertisement