♦ వచ్చే 3 నెలల తాగునీటి అవసరాలపై అంచనా
♦ విడుదల చేయాలని కృష్ణా బోర్డును కోరనున్న సర్కారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాల నిమిత్తం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్కు మరో దఫా నీటిని విడుదల చేయాలని సర్కారు కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరనుంది. వచ్చే మూడు నెలల కాలానికి 4.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరుతూ ఒకట్రెండు రోజుల్లో లేఖ రాయనుంది. జంట నగరాల తాగునీటి అవసరాలను పేర్కొంటూ జలమండలి ఇటీవలే నీటిపారుదల శాఖకు లేఖ రాసింది. ఈ లేఖను పరిగణనలోకి తీసుకుంటూ మే నెలాఖరు వరకు నీటి అవసరాలను నాగార్జునసాగర్ చీఫ్ ఇంజనీర్ లెక్కలు కట్టారు. రోజుకు 525 క్యూసెక్కుల చొప్పున మూడు నెలలకు మొత్తంగా 4.53 టీఎంసీల అవసరాలు ఉంటాయని లెక్కగట్టారు. వీటితోపాటే నల్లగొండ మున్సిపాలిటీకి మే నెల వరకు 0.302 టీఎంసీలు, పెండ్లిపాకాల తాగునీటి పథకానికి 0.024 టీఎంసీలు, పెద్దవూర పథకానికి 0.0070 టీఎంసీలు, చేపూర్ తాగునీటి పథకానికి 0.014 టీఎంసీలు అవసరమవుతుందని గుర్తించారు. ఈ లెక్కలతో త్వరలోనే బోర్డుకు నీటిపారుదల శాఖ లేఖ రాయనుంది.
శ్రీశైలంలో తగ్గిన నిల్వలు
శ్రీశైలం జలాశయంలో నీటిమట్టాలు తగ్గుతున్నాయి. గత నెలలో శ్రీశైలంలో 832 అడుగుల వద్ద 52 టీఎంసీల నిల్వలు ఉండగా ప్రస్తుతం 821.6 అడుగులకు తగ్గి నిల్వ 42.02 టీఎంసీలకు పడిపోయింది. ఏపీ, తెలంగాణ తాగునీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేయడంతో ఇక్కడ నిల్వలు తగ్గాయి. ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్న నీటిలో వినియోగార్హమైన నీరు 790 అడుగుల దిగువ వరకు 17 టీఎంసీలు మాత్రమే ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నీటిని ఇరు రాష్ట్రాలు జూన్లో వర్షాలు కురిసే సమయం వరకు వాడుకోవాల్సి ఉంది. ప్రస్తుతం లభ్యతగా ఉన్న 17 టీఎంసీల్లో 5 టీఎంసీలు మే నెలాఖరు వరకు నల్లగొండ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు పోతే మరో 13 టీఎంసీల వరకు నీటి లభ్యత ఉంటుంది. అందులో ఏపీకి 8 టీఎంసీల వాటా పోయినా, మిగతా 5 టీఎంసీలతో జూన్ నెలాఖరు వరకు నెట్టుకురావచ్చని తెలంగాణ భావిస్తోంది. అప్పట్లోగా విస్తారంగా వర్షాలు కురిస్తే ఎలాంటి సమస్యా ఉండదు. ఒకవేళ వర్షాలు కురవకపోతే మాత్రం జూలై నుంచి తాగునీటి ఇక్కట్లు తప్పవని అధికారులు చెబుతున్నారు.
జంట నగరాలకు 4.5 టీఎంసీలు కావాలి
Published Wed, Feb 24 2016 12:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement