ఎటూ తేల్చని గాంధీ వైద్యులు
నైజీరియాకు చెందిన ఓ కొత్త వైరస్గా ప్రచారం
సాధారణ వైరల్ ఫీవర్గా వైద్యుల వెల్లడి
గాంధీ నుంచి ఎబోలా వార్డును మార్చాలని డిమాండ్
సిటీబ్యూరో: అనుమానిత వైరస్తో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 52 ఏళ్ల బాధితునికి సోకింది ఏ వైరస్ అనేది ఇంకా స ్పష్టం కాలేదు. బాధితునికి సోకింది ఎబోలా వైరస్ కాదని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ లాబోరేటరీ (ఎన్సీడీసీ) పరీక్షల్లో తేలడంతో ఈ వైరస్ గుర్తింపు అంశం మళ్లీ మొదటికి వచ్చింది. ఇదే సమయంలో నైజీరియాకు చెందిన ఓ కొత్తరకం వైరస్ కావొచ్చని కూడా ప్రచారం ఊపందుకుంది. అయితే బాధితునికి చికిత్స అందిస్తున్న వైద్యులు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. బాధితుడు సాధారణ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు ఎబోలా రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ శుభాకర్ స్పష్టం చేశారు. అ ంతేకాకుండా ఆయన ఆరోగ్యపరిస్థితి కూడా క్రమంగా మెరుగుపడుతోందని పేర్కొన్నారు.
ఎబోలా వార్డుపై వైద్యుల అభ్యంతరం
ఆస్పత్రి ఏడో అంతస్థులోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న బాధితుల వద్దకు వెళ్లేందుకు వైద్య సిబ్బంది జంకుతున్నారు. ఒక వేళ అటు వెళ్తే ఎక్కడ ఆ వైరస్ తమకు వ్యాపిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. స్టేట్ ర్యాపిడ్ రెస్పాన్స్ బృందం నర్సింహులు (ట్రీటింగ్ ఫిజీషియన్), వినోద్ (ఎపిడిమియాలజిస్ట్), సత్యమూర్తి (మైక్రోబయాలజీ)లు మినహా ఇతరులెవ్వరూ వెళ్లడానికి సాహసించడం లేదు. ఆ స్పత్రిలో ఎబోలా వార్డును ఏర్పాటు చేయడంపై వైద్యులు, సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో జనసంచారం లేని ప్రాంతంలో ఎబోలా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలంటున్నారు. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే గాంధీలో దీన్ని ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని తెలంగాణ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రవణ్కుమార్, సిద్ధిపేట రమేష్లు ప్రశ్నించారు.
కిడ్నీపై ప్రభావం...
గాంధీ ఆస్పత్రి : గాంధీ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న బాధితుని కిడ్నీపై వైరస్ ప్రభావం పడినట్లు వైద్యులు గుర్తించారు. అలాగే మూత్రం ఎరుపురంగుకు మారడంతో మూత్రం ద్వారా రక్తం బయటకు వెళ్లిపోతుందా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ రెండు లక్షణాల ఆధారంగా రూపాంతరం చెందిన కొత్త వైరస్ అని భావిస్తున్నారు. కిడ్నీ ప్రభావంపై నెఫ్రాలజీ వైద్య నిపుణులతో చర్చిస్తున్నామని ట్రీటింగ్ ఫిజీషియన్ నర్సింహులు తెలిపారు. పూర్తిస్థాయిలో నయం అయ్యేవరకు బాధితున్ని ఐసోలేషన్లోనే ఉంచి వైద్యసేవలు అందిస్తామని ఆయన అన్నారు.
రేపు గాంధీలో అవగాహన సదస్సు
ఎబోలా వైరస్పై ఈ నెల ఐదో తేదీన గాంధీఆస్పత్రిలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు రాష్ట్ర నోడల్ అధికారి శుభాకర్ తెలిపారు. బయోసేఫ్టీ లెవల్-3 ల్యాబోరేటరీలు పూణే, ఢిల్లీలో మాత్రమే ఉన్నాయని, రాష్ట్రంలోని లెవల్-2 లాబోరేటరీలను లెవ ల్-3కి అప్గ్రేడేషన్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఒక వేళ ఎబోలా దేశంలోకి ప్రవేశించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణలో గాంధీ, ఏపీలో కేజీహెచ్ ఆస్పత్రుల్లో ఎబోలా నోడల్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆ వైరస్ ఏమిటో..?
Published Wed, Dec 3 2014 11:34 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement