Sakshi News home page

బంగారు ఆభరణాల చోరీ

Published Wed, Aug 19 2015 3:37 PM

theft in lb nagar

ఎల్బీనగర్ (హైదరాబాద్): తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో దొంగలు పడి విలువైన ఆభరణాలు ఎత్తుకుపోయారు. ఈ ఘటన హైదరాబాద్ నగరం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యానగర్ కాలనీలో మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగింది. స్థానికంగా నివాసం ఉండే ప్రైవేటు ఉద్యోగి శ్రీనివాస్ ఇంటి తాళాలు పగులగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించారు. బీరువా తలుపులు తెరచి ఏడున్నర తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. ఈ ఘటనపై బాధితుడు బుధవారం ఉదయం చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement