♦ 2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవరి వరకు రిటైరైన
♦ 10 వేల మంది వారికి వర్తించని
♦ పదో పీఆర్సీ గ్రాట్యుటీ పెంపు
♦ ఒక్కొక్కరికీ రూ. 4 లక్షల చొప్పున నష్టం
సాక్షి, హైదరాబాద్: పదో పీఆర్సీ ప్రయోజనాల వర్తింపులో వేల మంది పెన్షనర్లు అన్యాయానికి గురయ్యారు. 2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవరి నాటికి రిటైరైన ఉద్యోగులకు పెరిగిన గ్రాట్యుటీ వర్తించకపోవడంతో ఒక్కొక్కరూ రూ. 4 లక్షల చొప్పున నష్టపోయారు. దీంతో వారంతా ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పడినప్పటికీ పదో పీఆర్సీ సిఫార సులను కొత్త ప్రభుత్వం వెంటనే అమలు చేయలేకపోయింది. దీనిపై ఉద్యోగుల ఆందోళనల ఫలితంగా 2015 మార్చి నుంచి పీఆర్సీని ఉద్యోగులకు నగదు రూపంలో వర్తింపజేసింది.
అంటే 2014 జూన్ నుంచి 2015 ఫిబ్రవరి వరకు 9 నెలలపాటు పీఆర్సీని నోషనల్గానే (రికార్డుల్లోనే ఉంటుంది) ఇచ్చింది. కానీ గ్రాట్యుటీ విషయంలో పెన్షనర్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. పదో పీఆర్సీ చైర్మన్ అగర్వాల్ సిఫారసుల ప్రకారం.. రిటైరైన ఉద్యోగులకు గతంలో ఉన్న రూ. 8 లక్షల గ్రాట్యుటీని రూ. 12 లక్షలకు పెంచారు. అయితే ఈ పెంపును ప్రభుత్వం 2015 మార్చి తరువాత నుంచి రిటైరైన వారికే వర్తింపజేసింది. అంతకుముందు 9 నెలల కాలంలో రిటైరైన వారికి రూ. 8 లక్షల గ్రాట్యుటీనే వర్తింపజేసింది. దీంతో ఒక్కో రిటైర్డ్ ఉద్యోగి రూ. 4 ల క్షల చొప్పున నష్టపోయారు. ఈ నేపథ్యంలో తమకు కూడా రూ. 12 లక్షల గ్రాట్యుటీని వర్తింపజేయాలని, నష్టపోయిన గ్రాట్యుటీ ఇవ్వాలని తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్, టీచర్స్ అసోసియేషన్ చైర్మన్ పి.వెంకట్రెడ్డి, అధ్యక్షుడు హన్మంత్రెడ్డి డిమాండ్ చేశారు. ఆ 9 నెలల కాలంలో సుమారు 10 వేల మంది వరకు ఉద్యోగులు పదవీ విరమణ చేశారని...అందువల్ల ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి పెన్షనర్లకు న్యాయం చేయాలని కోరారు.
ఆందోళనలో వేల మంది పెన్షనర్లు
Published Sun, Mar 20 2016 4:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
49 కేసుల్లో రూ.37,63,170 సొత్తు స్వాధీనం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటే అందరి లక్ష్యం
జగన్ను మళ్లీ సీఎం చేద్దాం
పద్మనాభంలో టీడీపీకి భారీ షాక్
No Headline
8 నుంచి 13 వరకు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు
రెండో రోజూ చందనం అరగదీత
ఈవీఎంల వినియోగంపై అవగాహన తప్పనిసరి
విశాఖ రుణం తీర్చుకుంటా
● లచ్చయ్యపేటలో అలా...
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement