టుడే న్యూస్‌ రౌండప్‌ | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Published Sun, Feb 26 2017 6:25 AM

today news roundup

గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌
నేడు ఏపీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ రాత పరీక్ష. ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు నిర్వహించనున్న ఈ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రం వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. 9: 45 గంటలు దాటితే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. 6,57,010 మంది అభ్యర్థుల కోసం ఏపీలో 1,376, తెలంగాణలో 86 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

టీడీపీ పొలిట్‌ బ్యూరో మీటింగ్‌
విజయవాడ: తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సమావేశంలో నేడు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.

కాపు సత్యాగ్రహం
ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా కాపు సత్యాగ్రహ దీక్షలు. కర్నూలు కాపు సత్యాగ్రహ దీక్షలో పాల్గొననున్న ముద్రగడ పద్మనాభం.

ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష
హైదరాబాద్‌: ఆదర్శ పాఠశాలల్లో అడ్మిషన్లకు సంబంధించిన ప్రవేశ పరీక్ష నేడు జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను విద్యాశాఖ పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 234 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది.

మంత్రుల భేటీ వాయిదా
గవర్నర్‌ సమక్షంలో ఇవాళ జరగాల్సిన తెలుగు రాష్ట్రాల మంత్రుల కమిటీ సమావేశం వచ్చే నెల 9వ తేదీకి వాయిదా పడింది. బడ్జెట్‌ రూపకల్పనలో తలమునకలై ఉండటంతో ఇవాళ్టి సమావేశాన్ని వాయిదా వేయాలని ఏపీ మంత్రులు కోరడంతో సమావేశం వాయిదా పడినట్లు సమాచారం.

బౌద్ధ సమ్మేళనం
సూర్యాపేట: నాగారం మండలం ఫణిగిరి వద్ద బౌద్ధ ప్రచారకుల సమ్మేళనం. 16 దేశాల నుంచి హాజరుకానున్న 40 మంది బౌద్ధమత బోధకులు.

Advertisement
Advertisement