టుడే న్యూస్ అప్‌డేట్స్ | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ అప్‌డేట్స్

Published Wed, Jul 6 2016 6:40 AM

today news updates

► విజయవాడ: నేడు గవర్నర్ నరసింహన్ విజయవాడకు వెళ్లనున్నారు. సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆయన భేటీ కానున్నారు.

► కాకినాడ: నేడు సప్లిమెంటరీ ఏపీ ఎంసెట్ ర్యాంకులు

► హైదరాబాద్: నేటి నుంచి న్యాయాధికారులు విధుల్లో చేరనున్నారు. దీంతో కోర్టుల్లో కార్యకలాపాలు యథాతథంగా జరగనున్నాయి. న్యాయవాదులు ఆందోళనపై నేడు ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

► ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. పట్టిసీమ నీటిని ఆయన విడుదల చేయనున్నారు.

► హైదరాబాద్: నేడు ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐటీల్లో రెండో దశ సీట్ల కేటాయింపు.

► యూరోకప్ ఫుట్ బాల్ టోర్నీలో నేడు పోర్చుగల్తో వేల్స్ తలపడనుంది. రాత్రి 12:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.

► ప్రోకబడ్డీలో నేడు దబాంగ్ ఢిల్లీతో జైపూర్ పింక్ పాంథర్స్(రాత్రి 8గంటలకు), తెలుగు టైటాన్స్తో యు ముంబా(రాత్రి 9గంటలకు) తలపడనున్నాయి.

Advertisement
Advertisement