టుడే న్యూస్‌ అప్డేట్స్‌ | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ అప్డేట్స్‌

Published Sat, Mar 11 2017 6:57 AM

today news updates

ఐదు రాష్ట్రాల ఫలితాలు నేడు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం. ఇందుకోసం ఎలక్షన్‌ కమిషన్ భారీ ఏర్పాట్లు చేసింది‌. మధ్యాహ్నానికి తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
► యూపీలో మొత్తం సీట్లు 403, మేజిక్‌ ఫిగర్‌ 202.
► పంజాబ్‌లో మొత్తం సీట్లు 117, మేజిక్‌ ఫిగర్‌ 59.
► ఉత్తరాఖండ్‌లో మొత్తం సీట్లు 70, మేజిక్‌ ఫిగర్‌ 36.
►మణిపూర్‌లో మొత్తం సీట్లు 60, మేజిక్‌ ఫిగర్‌ 31.
► గోవాలో మొత్తం సీట్లు 40, మేజిక్‌ ఫిగర్‌ 21.

తెలంగాణ అసెంబ్లీ
హైదరాబాద్: ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం. ఆదివారం సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తెలుపనున్న తెలంగాణ కేబినెట్‌.

మళ్లీ నోక్యాష్‌!
తెలుగురాష్ట్రాల్లో మళ్లీ నోక్యాష్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. చాలా చోట్ల ఏటీఎంలు పనిచేయడం లేదు. బ్యాంకుల్లో లావాదేవీలను పరిమితంగా నిర్వహిస్తూ.. విత్‌డ్రాయల్స్‌పై ఆంక్షలు విధిస్తున్నారు.

అవగాహన సదస్సు
వృద్ధులకు న్యాయసేవలపై నేడు తిరుపతిలో అవగాహన సదస్సు. ఈ సదస్సులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేష్‌ రంగనాథన్‌ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

క్వార్టర్స్‌లో ఇంటిదారి
ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ నుంచి భారత స్టార్స్‌ సైనా నెహ్వాల్‌, పీవీ సింధు నిష్క్రమించారు. కొరియా క్రీడాకారిణి సుంగ్‌ జీ హున్‌ చేతిలో 20-22, 20-22 తేడాతో సైనా పోరాడి ఓడింది. మరో మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి తై జు యింగ్‌ చేతిలో14-21, 10-21 తేడాతో సింధు పరాజయం పాలైంది.

Advertisement
Advertisement