ఇవాళ్టి ముఖ్యాంశాలు | Sakshi
Sakshi News home page

ఇవాళ్టి ముఖ్యాంశాలు

Published Sat, Apr 15 2017 6:56 AM

today news updates

తెలంగాణ కేబినెట్‌ భేటీ
హైదరాబాద్‌: ఇవాళ తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. బీసీ కమిషన్‌ నివేదిక, రిజర్వేషన్ల పెంపు అంశంపై చర్చించనున్నారు. 50 శాతం ఉన్న రిజర్వేషన్లను 68 శాతానికి పెంచే యోచనలో ప్రభుత్వం.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
నేటి నుంచి భువనేశ్వర్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పార్టీ ముఖ్యనేతలు, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. సీనియర్‌ నేతలు అద్వానీ, ఎంఎం జోషీలు సమావేశాల్లో పాల్గొననున్నారు.

టీఎస్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఆదివారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు శాసనసభ, సాయంత్రం 4 గంటలకు మండలి సమావేశం. రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు.

చిత్తూరు మేయర్‌ ఎన్నిక
నేడు చిత్తూరు మేయర్‌ ఎన్నికను నిర్వహించనున్న కలెక్టర్‌. 2015 నవంబర్‌ 17న కార్యాలయంలో అనురాధ హత్యకు గురైన విషయం తెలిసిందే. అనురాధ స్థానంలో ఆమె కోడలు హేమలతను ఎన్నుకునే అవకాశం.

తిరుమలలో పెరిగిన రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం ఉదయం 31 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 14 గంటలు, నడక భక్తులకు 12 గంటల సమయం పడుతోంది.

ఐపీఎల్‌లో నేడు
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో హైదరాబాద్‌ తలపడనుంది. కోల్‌కతా వేదికగా సాయంత్రం 4 గంటలకు మ్యాచ్‌ ప్రాంరభం. మరో మ్యాచ్‌లో ఢిల్లీతో పంజాబ్‌ తలపడనుంది. ఢిల్లీ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం.

Advertisement

తప్పక చదవండి

Advertisement