టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌ | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌

Published Sun, Apr 23 2017 6:55 AM

today news updates

చిత్తూరు జిల్లాకు వైఎస్‌ జగన్‌
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ నేడు ఏర్పేడు ఘటన బాధితులను పరామర్శించనున్నారు. మునగలపాలెం, మలిసిపేడు, రావిళ్లవారిపల్లె అరుంధతివాడ ప్రాంతాలకు చేరుకుని.. ఏర్పేడులో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను వైఎస్‌ జగన్‌ పరామ ర్శించనున్నారు.
 
గ్రూప్‌-3 ప్రిలిమ్స్‌
అమరావతి: నేడు ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-3 ప్రిలిమ్స్‌ పరీక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 1430 కేంద్రాల్లో స్క్రీనింగ్‌ టెస్ట్‌. పంచాయితీ కార్యదర్శి పోస్టులకు 5.66 లక్షల మంది దరఖాస్తు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12: 30 గంటల వరకు పరీక్ష. జులై 16న గ్రూప్‌-3 మెయిన్స్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.

దినకరన్‌ విచారణ
న్యూఢిల్లీ: నేడు దినకరన్‌ను మరోసారి ప్రశ్నించనున్న పోలీసులు. రెండాకుల గుర్తు కోసం ఈసీకి ముడుపులు ఇవ్వజూపారన్న కేసులో విచారణ.

ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికలు
దేశ రాజధాని ఢిల్లీ మునిసిపల్‌ ఎన్నికలు నేడు జరగనున్నాయి. 1.3 కోట్ల మంది ఓటర్లు 272 మంది కౌన్సిలర్లను ఎన్నుకోనున్నారు. ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.

నీతి ఆయోగ్‌ సమావేశం
ఢిల్లీలో నేడు నీతి ఆయోగ్‌ సమావేశం. రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ  సమావేశంలో దేశ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన 15 ఏళ్ల దార్శనిక పత్రంపై చర్చించనున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లు హాజరుకానున్నారు.

ఐపీఎల్‌లో నేడు
గుజరాత్‌ వర్సెస్‌ పంజాబ్‌. రాజ్‌కోట్‌ వేదికగా సాయంత్రం 4 గంటలకు మ్యాచ్‌. మరో మ్యాచ్‌లో కోల్‌కతా వర్సెస్‌ బెంగళూరు. కోల్‌కతా వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్‌.

Advertisement
Advertisement