నేడు మల్లన్నసాగర్కు టీపీసీసీ బృందం
సాక్షి, హైదరాబాద్: భూనిర్వాసితులకు న్యాయం జరిగే దాకా పోరాడతామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. భూసేకరణ చట్టం, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో ఉల్లంఘనలపై సోమవారం గాంధీభవన్లో టీపీసీసీ సబ్కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ... 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ చట్టాన్ని తుంగలో తొక్కడానికి, రైతుల నుంచి అన్యాయంగా భూమిని తీసుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం జీవో 123 తెచ్చిందని దుయ్యబట్టారు. ఈ సమావేశం వివరాలను పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, మల్లు రవి మీడియాకు వివరించారు.
తాము ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకం కాదని, అయితే నిర్వాసితులకు చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరుతున్నామన్నారు. వారికి న్యాయం జరిగేదాకా పార్టీ అండగా ఉంటూ పోరాటం చేస్తుందన్నారు. మల్లన్నసాగర్లో భూమి కోల్పోతున్నవారితో మాట్లాడటానికి, అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడానికి మంగళవారం టీపీసీసీ సబ్కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహ నేతృత్వంలో కమిటీ పర్యటిస్తుందని వెల్లడించారు. సబ్కమిటీ సమావేశంలో పార్టీ నేతలు దామోదరతోపాటు డీకే అరుణ, ఎం.కోదండరెడ్డి, జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఉత్తమ్కు గవర్నర్ శుభాకాంక్షలు
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా సోమవారం గాంధీభవన్లో వేడుకలు జరిగాయి. పార్టీ నేతలు కేక్ కట్ చేసి, శుభాకాంక్షలను తెలియజేశారు. గవర్నర్ నరసింహన్ కూడా ఉత్తమ్కు ఫోన్లో శుభాకాంక్షలను తెలిపారు.
నిర్వాసితులకు బాసట: ఉత్తమ్
Published Tue, Jun 21 2016 2:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement