జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ యాదయ్య
సిటీబ్యూరో: జవ హర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ రిజిస్ట్రార్గా జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ యాదయ్య బాధ్యతలు స్వీకరించారు. రిజిస్ట్రార్గా యాదయ్య నియామకానికి బుధవారం సాయంత్రం వర్సిటీ వైస్ చాన్స్లర్ శైలజా రామయ్యర్ ఆమోదం తెలిపారు. రెండు రోజుల క్రితం జరిగిన విద్యాశాఖ సమీక్ష సమావేశంలో యాదయ్యను రిజిస్ట్రార్గా నియమించాలని సీఎం కేసీఆర్ స్వయంగా అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రిజిస్ట్రార్గా పనిచేసిన ఎన్వీ రమణారావు ఇకపై సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్గా కొనసాగనున్నారు. నూతన రిజిస్ట్రార్ యాదయ్య ‘సాక్షి’తో మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా కృషి చేస్తామని చెప్పారు. ప్రతి విషయంలో పారదర్శకంగా మెలుగుతానని పేర్కొన్నారు. అందరి సలహాలు, సూచనలతో వర్సిటీ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపచేస్తామని పేర్కొన్నారు.
చదువుకున్న చోటే ఉన్నత పదవి
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన యాదయ్య...జేఎన్టీయూహెచ్లో ఉన్నత చదువులు అభ్యసించి.. అదే వర్సిటీకి రిజిస్ట్రార్గా నియామకం కావడం విశేషం. 2014లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ ఆయన్ను ఇంజినీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది. అంతేగాక ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ... యంగ్ సైంటి స్ట్ ఫెలోషిప్ అందజేసింది. బోధన, పరిశోధనలో 20 ఏళ్ల అనుభవం ఆయన సొంతం.
ప్రొఫైల్..
నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం మల్రెడ్డిగూడెం సొంతూరు
భార్య పద్మ, సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఇద్దరు అమ్మాయిలు
ఒకటి నుంచి పదో తరగతి వరకు సర్వేల్లోని జెడ్పీహెచ్ఎస్
మలక్పేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్
1988లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
1992లో జేఎన్టీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధుల్లోకి
2000లో జేఎన్టీయూహెచ్లో పీహెచ్డీ
2001లో అసోసియేట్ ప్రొఫెసర్గా విధులు
2006లో ప్రొఫెసర్గా పదోన్నతి
గతేడాది జేఎన్టీయూహెచ్లో ప్రిన్సిపాల్గా నియామకం
పారదర్శకత.. నాణ్యమైన విద్యే లక్ష్యం
Published Thu, Jul 23 2015 11:50 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement