♦ షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన ఎన్నికల కమిషన్
♦ ఈనెల 27న ఖమ్మంలో ప్లీనరీ, బహిరంగ సభ
సాక్షి, హైదరాబాద్: పాలేరు ఉప ఎన్నిక కోడ్ నేపథ్యంలో ఖమ్మంలో ఈ నెల 27న జరపతలపెట్టిన టీఆర్ఎస్ ప్లీనరీ, బహిరంగ సభలు జరుగుతాయా లేదా అన్న సందిగ్ధానికి తెరపడింది. ప్లీనరీ నిర్వహించుకోవడానికి టీఆర్ఎస్కు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం అనుమతి ఇస్తూ, కొన్ని షరతులు విధించింది. ఈ సారి 15వ ప్లీనరీని ఖమ్మంలో జరపాలని టీఆర్ఎస్ నెల రోజుల కిందటే నిర్ణయించింది. కాగా, ఇదే జిల్లా పరిధిలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖరారు కావడంతో ఎన్నికల నిబంధనలు అనుమతించవన్న అభిప్రాయం వ్యక్తమయింది.
ఈ నేపథ్యంలో పార్టీ నేత, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు, రాష్ట్ర సీఈసీకి లేఖ రాశారు. ముందుగానే తమ కార్యక్రమాలను ఖరారు చేశామని, ఇప్పటికిప్పుడు ఇతర ప్రాంతానికి ప్లీనరీ వేదికను తరలించడం కష్టమైనందున నిర్వహణకు అనుమతించాలని ఆ లేఖలో కోరారు. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా సీఈసీ భన్వర్లాల్ను కలసి ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీ, బహిరంగ సభల నిర్వహణకు అనుమతి ఇవ్వొద్దని కోరింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం కేటీఆర్కు ఈసీ నుంచి లేఖ అందింది. ‘ఈనెల 27న టీఆర్ఎస్ ప్లీనరీ, బహిరంగ సభలను నిర్వహించుకోవడానికి అనుమతి ఇస్తున్నాం. అయితే, ఈ ఖర్చును పార్టీ ఖాతాలో చూపించాలి. ఏర్పాట్లలో ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించుకోవద్దు. ముఖ్యమంత్రి, మంత్రులు ఈ కార్యక్రమం నేపథ్యంలో అధికారిక పర్యటనలు జరపొద్దు’ అని షరతులు విధించింది. కాగా, ప్లీనరీ, బహిరంగ సభలను విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. శుక్రవారం, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో మంత్రులు జన సమీకరణపై సమీక్షలు నిర్వహించారు.
సీఎంతో ప్లీనరీ తీర్మానాల కమిటీ భేటీ
ప్లీనరీలో ప్రవేశ పెట్టాల్సిన తీర్మానాలకు సీఎం కె.చంద్రశేఖర్రావు తుది రూపునిచ్చారు. ప్లీనరీ తీర్మానాల కమిటీ కన్వీనర్, ఎంపీ కె.కేశవరావు నేతృత్వంలోని బృందం శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్తో భేటీ అయ్యింది. ప్లీనరీలో రాజకీయ తీర్మానాలు కాకుండా ప్రభుత్వ పథకాలు, విధానాలకు సంబంధించి 14 లేదా 15 తీర్మానాలు ఉంటాయని సమాచారం.
టీఆర్ఎస్ ప్లీనరీకి తొలగిన అడ్డంకులు
Published Sat, Apr 23 2016 3:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement