స్ట్రాంగ్ రూముల్లో భవితవ్యం
కర్నూలు(సెంట్రల్): సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యాన్ని అధికారులు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూములకు తరలించి భద్రపరిచారు. ఓటరు తీర్పు ఎటు వైపు ఉన్నదో జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపులో తేలనున్నది. కాగా 2024 పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల తుది పోలింగ్ వివరాలను మంగళవారం ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. కొన్ని కేంద్రాల్లో మే 13వ తేదీ అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగడంతో ఓటింగ్ వివరాలు పూర్తి స్థాయిలో విడుదల కాలేదు. ఈ క్రమంలో మంగళవారం విడుదలైన వివరాల ప్రకారం కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో 76.80 శాతం ఓటింగ్ నమోదైంది. అలాగే జిల్లాలోని కర్నూలు, పాణ్యం, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 76.42 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే 2019 ఎన్నికలతో పోల్చుకుంటే నమోదైన ఓటింగ్ శాతం అసెంబ్లీల్లో స్పల్పంగా పెరగగా..పార్లమెంట్లో స్వల్పంగా తగ్గింది.
2019 ఎన్నికలతో పోల్చుకుంటే అసెంబ్లీల్లో 0.6 శాతం అధికం..
కర్నూలు జిల్లాలో మొత్తం 20,54,563 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 10,13,794 మంది, సీ్త్రలు 10,40,451, ఇతరులు 318 మంది ఉన్నారు. అయితే మొత్తం ఓటర్లలో 15,70,007 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 7,88,074 మంది, మహిళలు 7,81,793 మంది, ఇతరులు 135 మంది ఉన్నారు. అయితే మహిళల కంటే 6,286 మంది పురుష ఓటర్లే అధికంగా ఓటు వేశారు. మొత్తంగా అన్ని నియోజకవర్గాల్లో కలిపి 76.42 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా, ఈ పోలింగ్ శాతం 2019 ఎన్నికలతో పోల్చుకుంటే 0.6 శాతం అధికంగా నమోదైంది. అలాగే కర్నూలు పార్లమెంట్కు సంబంధించి 2019లో 78.28 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో 76.80 శాతం మంది ఓటు వేశారు. 2019 ఎన్నికలతో పోల్చుకుంటే ప్రస్తుత ఎన్నికల్లో 1.48 శాతం పోలింగ్ తగ్గింది.
ఆర్యూకు తరలింపు
ఎన్నికలు ముగియగానే ఈవీఎంలను పోలింగ్ కేంద్రాల నుంచి అత్యంత భద్రత నడుమ జీపీఎస్తో అనుసంధానమైన వాహనాల్లో రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్లకు తరలించారు. ఈ క్రమంలో వాటిని మూడంచెల భద్రత, సీసీ కెమెరాల నిఘా ఉన్న స్ట్రాంగ్ రూమ్ల్లో మంగళవారం ఉదయం కలెక్టర్ జనరల్ అబ్జర్వర్ జాఫర్ వి. డాక్టర్ జి.సృజన, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో భద్రపరచారు. ఏజెంట్లతో సంతకాలు తీసుకున్న తరువాత సీల్ వేసి తాళాలు వేశారు. కర్నూలు, ఆదోని అసెంబ్లీలు, పార్లమెంట్కు సంబంధించిన ఈవీఎంలను లైఫ్ సైన్సెస్ బ్లాక్లో, కోడుమూరు, ఎమ్మిగనూరునకు సంబంధించిన ఈవీఎంలను ఇంజినీరింగ్ బ్లాక్లో, మంత్రాలయం, పాణ్యం, ఆలూరు అసెంబ్లీలకు సంబంధించి లైబ్రేరి బాక్ల్లో, పత్తికొండ అసెంబ్లీకి సంబంధించిన ఈవీఎంలను లైబ్రేరి బ్లాక్–3 భద్రపరచారు. ఈవీఎంలను భద్రపరచే కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల ఆర్వోలు, ఏఈఆర్ఓలు పాల్గొన్నారు. అసెంబ్లీ 2019లో 2024లో
స్థానాలు ఓటింగ్ శాతం ఓటింగ్ శాతం
కర్నూలు 59.53 63.75
పత్తికొండ 83.97 84.98
కోడుమూరు 79.52 79.14
ఎమ్మిగనూరు 79.16 81.97
మంత్రాలయం 84.98 84.31
ఆదోని 65.31 66.55
ఆలూరు 79.71 80.73
పాణ్యం 74.41 74.44
కర్నూలు పార్లమెంట్ 78.28 76.80పత్తికొండలో అధికం... కర్నూలులో అత్యల్పంగా పోలింగ్ 2019 ఎన్నికలతో పోల్చుకుంటే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో స్వల్పంగా పోలింగ్ శాతం పెరిగింది. అయితే కోడుమూరు, ఎమ్మిగనూరులలో మాత్రం స్వల్పంగా పోలింగ్ శాతం తగ్గడం గమనార్హం. ఈ ఎన్నికల్లో పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరులలో ఏకంగా 80 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే అత్యధికంగా పత్తికొండలో 84.98 శాతం మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యల్పంగా కర్నూలులో 63.75 శాతం ఓటింగ్ నమోదైంది. అయితే, 2019 ఎన్నికల్లో అత్యల్పంగా పోలింగ్ నమోదైన కర్నూలు, ఆదోనిలలో 75 శాతం ఓటింగ్ను పెంచాలని అధికారుల చేసిన ప్రయత్నం ఫలించలేదు. గత ఎన్నికల్లో కర్నూలులో 59.53 శాతం ఓటింగ్ నమోదు కాగా, 63.75 శాతానికి పెరిగింది. అలాగే ఆదోనిలో గత ఎన్నికల్లో 65.31 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఈ సారి 66.55 శాతం మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏదిఏమైనా ఈ రెండు నియోజకవర్గాల్లో స్వల్పంగా పోలింగ్ శాతం పెరిగింది.
కర్నూలు పార్లమెంట్లో 76.80 శాతం ఓటింగ్ నమోదు
8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి 76.42 శాతం పోలింగ్
తుది పోలింగ్ నమోదు వివరాలు విడుదల చేసిన ఎన్నికల కమిషన్
జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్, ఫలితాల ప్రకటన
అత్యధికంగా పత్తికొండలో 84.98 శాతం, అత్యల్పంగా కర్నూలులో 63.75 శాతం ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్లకు మూడంచెల భద్రత