ఏప్రిల్ 24న కానిస్టేబుల్ రాతపరీక్ష | Sakshi
Sakshi News home page

ఏప్రిల్ 24న కానిస్టేబుల్ రాతపరీక్ష

Published Mon, Mar 28 2016 5:04 PM

TS Constables written test on April 24th

హైదరాబాద్ : తెలంగాణలో వాయిదా పడిన కానిస్టేబుల్ రాతపరీక్ష ఏప్రిల్ 24న నిర్వహించనున్నారు. ఏప్రిల్ 3న నిర్వహించాల్సిన కానిస్టేబుల్ రాతపరీక్ష రైల్వే రిక్రూట్‌మెంట్ పరీక్షలకు అడ్డుగా ఉండటంతో వాయిదా వేసిన విషయం తెలిసిందే. 3న ఆర్‌ఆర్‌బీ పరీక్షలు జరుగుతుండటంతో.. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కానిస్టేబుల్ నియామక రాత పరీక్షను వాయిదా వేసింది. తాజాగా ఏప్రిల్ 24న కానిస్టేబుల్ నియామక రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా ఎస్సై రాత పరీక్ష యథాతథంగా ఏప్రిల్ 17న జరుగనుంది.

Advertisement
Advertisement