-టీఆర్ఎస్ వార్తలను పెయిడ్ ఆర్టికల్స్గా పరిగణించాలి
- ఎన్నికల సంఘానికి, ప్రెస్ కౌన్సిల్కు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఫిర్యాదు
హైదరాబాద్: తన ఊహలను త్రీడీ బొమ్మల రూపంలో చిత్రీకరించి ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రజలను మభ్యపెడుతున్నారని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్రెడ్డి విమర్శించారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా అభివృద్ధి నమూనాలను పత్రికల్లో ప్రచురించి డబ్బు సంపాదించడంతో పాటు ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఈ నెల 23న 'నమస్తే తెలంగాణ' పత్రికలో హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు మెట్రో రైలు విస్తరణ పనులు , దుర్గం చెరువు మీద 4 లైన్ల బ్రిడ్జి నిర్మాణం, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టెండర్లు పిలుస్తున్నారంటూ వార్తలు ప్రచురితమయ్యాయని తెలిపారు. ఈ అంశాలు ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపుతాయన్నారు. దీనిపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టాలని కోరారు.
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు టెండర్లు కేసీఆర్ వద్ద ఉండే ఓ చిత్రగుప్తుడు భేతాళ మాంత్రికుని బినామీ కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. పాలమూరు టెండర్ల ద్వారా వచ్చిన కమీషన్లతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు 66 డివిజన్లు ఉన్న రంగారెడ్డి జిల్లాకు పనికొచ్చే ఎత్తిపోతల పథకం టెండర్లను ఎలా పిలుస్తారని ప్రశ్నించారు.
దీనిపై ఎన్నికల సంఘం విచారణ జరపాలని, నమస్తే తెలంగాణ పత్రిక, టీ న్యూస్ ఛానెళ్లలో వచ్చే వార్తలను పెయిడ్ ఆర్టికల్స్గా పరిగణించాలని, టీఆర్ఎస్ అభ్యర్థుల ఖాతాల్లో జమచేయాలని కోరారు. ఎన్నికల్లో రూ. 5లక్షల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టిన వారిని అనర్హులుగా ప్రకటించాలన్నారు.ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి , ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.
ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా:రేవంత్
Published Sat, Jan 23 2016 7:25 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement