ప్రధాని మోదీకి ఉత్తమ్ బహిరంగ లేఖ | Sakshi
Sakshi News home page

మిషన్ భగీరథ ప్రారంభించొద్దు: ఉత్తమ్

Published Thu, Aug 4 2016 4:42 PM

Uttam kumar reddy's open letter to Prime Minister Narendra Modi

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మిషన్ భగీరథను ప్రారంభించవద్దని ఆయన ఈ సందర్భంగా తన లేఖలో కోరారు. ప్రధాని తెలంగాణ పర్యటనను కేసీఆర్ తన వ్యక్తిగత ప్రచారానికి వాడుకుంటున్నారని ఉత్తమ్ పేర్కొన్నారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పేరుతో ప్రారంభమైన ఎల్లంపల్లి-హైదరాబాద్ సాగునీటి ప్రాజెక్ట్ను మిషన్ భగీరథగా మార్చేశారన్నారు. కాంగ్రెస్ హయాంలోనే రూ.3,350 కోట్లతో ఆ ప్రాజెక్ట్ పూర్తయిందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను మోదీ అమలు చేయాలని, నిధులు కేటాయిస్తున్నట్లు తన పర్యటనలో ప్రకటించాలని ఉత్తమ్ తన లేఖలో డిమాండ్ చేశారు.

 

Advertisement
Advertisement