ప్రభుత్వంపై భ్రమలు తొలిగాయి: వంశీచంద్‌ | Sakshi
Sakshi News home page

ప్రభుత్వంపై భ్రమలు తొలిగాయి: వంశీచంద్‌

Published Fri, Jun 30 2017 2:22 AM

ప్రభుత్వంపై భ్రమలు తొలిగాయి: వంశీచంద్‌ - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వ్యవహారశైలిపై రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు విసిగిపోయారని, సీఎం కేసీఆర్‌పై భ్రమలు తొలిగిపోయాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి అన్నారు.

గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి పరిస్థితుల్లో ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌కు ఓట్లు కాదు.., రాళ్లు పడతాయని హెచ్చరిం చారు. డిండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ను పాలమూరు–రంగారెడ్డికి అనుసంధానం చేయడం సరికాదన్నారు. డిండి ప్రాజెక్ట్‌కు శ్రీశైలం నుంచి ప్రత్యేకంగా నీటి కేటాయింపులు చేయాలని వంశీ డిమాండ్‌ చేశారు. డిండి, పాలమూరు అనుసంధానాన్ని వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు.

Advertisement
Advertisement