సాక్షి, హైదరాబాద్: ప్రజాగర్జన పేరుతో విజయనగరంలో నిర్వహించిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలేనని, ఆయన తీరు పగటి వేషగాడి మాదిరిగా తయారైందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... సీమాంధ్రను సింగపూర్లాగా అభివృద్ధి చేస్తానని, సీమాంధ్రకు రాజధానిని తానే నిర్మిస్తానని ప్రగల్భాలు చెబుతున్న చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లపాటు ఉన్నపుడు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు.
చంద్రబాబు హయాంలో అంతర్జాతీయ విమానాశ్రయం కట్టడానికి నగరం వెలుపల స్థలమిచ్చినా, దానికి దారి చూపించలేకపోయారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాతనే విమానాశ్రయానికి దారులు వేస్తూ ఎక్స్ప్రెస్ హైవే, ఔటర్ రింగురోడ్డు వంటి వాటిని నిర్మించారని గుర్తుచేశారు. ఇంకా ఏమన్నారంటే...
మీ హయాంలో రాష్ట్ర అభివృద్ధికి పనికి వచ్చే ఒక్క సాగునీటి ప్రాజెక్టునైనా ఎందుకు కట్టలేకపోయారు? కృష్ణా డెల్టా ఆయకట్టుకు రెండో పంటకు కాదు కదా, ఒక్క పంటకు కూడా నీరు ఎందుకు ఇవ్వలేక పోయారు?
పట్టుమని పది అసెంబ్లీ సీట్లు, ఒక్క లోక్సభ స్థానం కూడా గెల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబు సీమాంధ్రను సింగపూర్ చేయగలరా? ఆరునెలల నుంచి నిద్రపోవడంలేదని చెబుతున్న చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా ఆరేళ్ల కిందట ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోలేదెందుకు?
రాజధానికి నాలుగైదు లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ఇవ్వాలని డిమాండ్ చేసిన చంద్రబాబుకు అసలు ఇపుడు విభజన అన్యాయమని మాట్లాడే అర్హత ఉందా?
విభజన బిల్లు చాలా బాగుందని మొదటి ఓటు తామే వేశామని, అందుకు తమకు గర్వంగా ఉందని టీడీపీ ఎంపీ చెప్పలేదా? బిల్లు పెట్టిన కాంగ్రెస్, బిల్లు బాగుందన్న టీఆర్ఎస్, టీడీపీకి ఉన్న తేడా ఏమిటి?
పగటి వేషగాడిలా చంద్రబాబు :వాసిరెడ్డి పద్మ
Published Fri, Feb 28 2014 1:42 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement