Sakshi News home page

విదేశాల్లోనూ పరువు తీస్తున్నారు

Published Wed, May 10 2017 1:56 AM

విదేశాల్లోనూ పరువు తీస్తున్నారు - Sakshi

చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నేత వాసిరెడ్డి పద్మ ధ్వజం  

సాక్షి, హైదరాబాద్‌: సీఎం చంద్రబాబు తన దుర్మార్గపు పాలనతో విదేశాల్లోనూ రాష్ట్రం పరువు తీస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. ఈ మెయిళ్ల వ్యవహారంలో టీడీపీ నేతలు అడ్డగోలుగా మాట్లా డుతుండటంపై మండిపడ్డారు. ఏపీలో అమాయకులైన ఎర్రచందనం కూలీల్ని మట్టుబెట్టిన బాబు అమెరికాలో పర్యటిస్తున్నారంటూ ఎవరో ఇచ్చిన ఈ–మెయిల్‌ తో అక్కడి పోలీసులు నిఘా పెట్టారన్నారు. దీనిపై అమెరికాలోను, రాష్ట్రంలోనూ టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీపై బురదజల్లే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

కుట్ర అనే మాటకు పేటెంట్‌ హక్కు ఒక్క బాబుకే ఉందని పద్మ విమర్శిం చారు.  చీకట్లో చిదంబరంను కలసి.. సోనియాగాంధీతో కుమ్మక్కై తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసులు నమోదు చేయించారని దుయ్యబట్టారు. మరణించిన మాజీ ఎమ్మెల్యే బి.నారాయణ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్‌ అనంతపురం వెళితే, ఆయన లోటస్‌పాండ్‌లోనే ఉండి అమెరికాకు సంబం ధించిన ప్లాన్లు వేస్తున్నారని రాయడమనేది కుట్ర అని విమర్శించారు. అంతర్జాతీ యంగా ఏపీ పరువుపోయే పరిస్థితులు కల్పించవద్దని, అంతర్జాతీయ వేదికలపై ప్రతిష్ట పోగొట్టొద్దని టీడీపీకి ఆమె హితవు పలికారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement