అది రాష్ట్రాల అంశం: కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని, అవి రాష్ట్రాలకు సంబంధించిన అంశాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఎన్కౌంటర్ల అంశం రాష్ట్రాల పరిధిలోనిది. వాటిపై కేంద్రం జోక్యం చేసుకోదు.
ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం కూలీలపై జరిగిన ఎన్కౌంటర్పై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఆ రాష్ర్ట ప్రభుత్వంపైనే ఉంది. ఎన్కౌంటర్ వల్ల తమిళనాడు, ఏపీల మధ్య ఏర్పడిన వివాదం ఏక్కడికి వెళుతుందో చూద్దాం. సిమి ఉగ్రవాదులను నియంత్రించడంలో తెలంగాణ ప్రభుత్వం సమర్ధంగా పనిచేసింది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎన్కౌంటర్ జరిగితే కొంత మంది తీవ్రంగా స్పందిస్తున్నారు.
సామాన్య ప్రజలు, పోలీసులు అలాంటి సంఘటనల్లో మరణిస్తే వీరు కనీసం మాట కూడా మాట్లాడరు. గతంలో పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపితే మజ్లిస్ నేతలు ఎందుకు నోరు మెదపలేదు. పోలీసులు మనుషులు కాదా?. ఎన్కౌంటర్లపై విచారణ జరపాలని కోరడంలో తప్పులేదు. కానీ అసహాయులు చనిపోయినప్పుడు మౌనం వహించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పట్ల అతిగా స్పందించడం సరికాదు.
‘బోస్’ నిఘా వార్తలపై కాంగ్రెస్కు ఉలుకెందుకు?
జాతి నేత సుభాష్ చంద్రబోస్ కుటుంబంపై గతంలో 20 ఏళ్లపాటు ప్రభుత్వం నిఘా పెట్టిందన్న కథనాలపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను దేశ ప్రజల ముందుంచాలి. ఈ విషయాలు బయటకు పొక్కగానే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉలిక్కి పడుతోంది?. ఇళ్లు కొనేవారు, అమ్మేవారిద్దరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రియల్ఎస్టేట్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులైజేషన్ చట్టం ఆమోదం కోసం రానున్న పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశ పెట్టబోతోంది.
ఎన్కౌంటర్లపై కేంద్రం జోక్యం చేసుకోదు
Published Sun, Apr 12 2015 4:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
వరల్డ్కప్కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement