విజయ పాలు లీటరు రూ. 2 పెంపు | Sakshi
Sakshi News home page

విజయ పాలు లీటరు రూ. 2 పెంపు

Published Wed, Jan 4 2017 3:30 AM

విజయ పాలు లీటరు రూ. 2 పెంపు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య సరఫరా చేస్తున్న విజయ పాలను లీటరుకు రూ. 2 పెంచుతున్నట్లు విజయ డెయిరీ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

దీంతో ప్రస్తుతం లీటరు రూ. 38కి అందిస్తున్న పాలు.. ఈ నెల 5వ తేదీ నుంచి రూ. 40కి విక్రయించనున్నారు. ఈ మార్పును పరిగణనలోకి తీసుకుని వినియోగదారులు సహకరించాలని డెయిరీ అధికారులు  విజ్ఞప్తి చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement