♦ విద్యా వలంటీర్లకు ఐదు నెలలుగా అందని జీతాలు
♦ గౌరవ వేతనమిచ్చే పద్దులో తేడాలున్నాయంటూ ట్రెజరీ కొర్రీ
♦ రెండ్రోజుల్లో సమస్యను పరిష్కరిస్తాం: పాఠశాల విద్యా డెరైక్టర్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యా వలంటీర్లకు ఐదు నెలలుగా వేతనాలు కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. విద్యావలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనానికి సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ, కొన్ని జిల్లాల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా సకాలంలో చెల్లింపులు జరగడం లేదు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 7,974 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉండగా, ఆయా పోస్టులను ప్రభుత్వం విద్యా వలంటీర్లతో గత సెప్టెంబర్లో భర్తీ చేసిన విషయం విదితమే. వీరికి నెలకు రూ.8 వేల చొప్పున వేతనమిచ్చేలా ఉత్తర్వులు కూడా ఇచ్చింది.
ఈ విద్యా సంవత్సరంలో ఏడు నెలలు మాత్రమే పనిచేసే తమకు గత ఐదు నెలలుగా వేతనాలు అందకపోవడం పట్ల పలువురు విద్యా వలంటీర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, మహబూబ్నగర్ జిలాల్లో పూర్తిగానూ, మిగిలిన జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వేతనాలు అందకపోవడంపై విద్యాశాఖకు ఫిర్యాదులు అందాయి. హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో ఉపాధ్యాయ సంఘాలతో కలసి ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చినప్పటికీ అధికారులు స్పందించడం లేదని వలంటీర్లు ఆరోపిస్తున్నారు. సదరు జిల్లాల్లో బిల్లులు పాస్ చేయకుండా ట్రెజరీ అధికారులు కొర్రీలు పెడుతున్నారని వాపోతున్నారు.
మరోవైపు ప్రభుత్వం విద్యావలంటీర్లకు గౌరవ వేతనమిచ్చే పద్దులో కాకుండా వేరే పద్దులో నిధులు విడుదల చేయడం వలన సమస్యలు ఉత్పన్నమయ్యాయని ట్రెజరీ అధికారులు చెబుతున్నారు. తప్పులను సరిచేయడంలో విద్యాశాఖ అధికారులు స్పందించకపోతుండడమే వేతనాల విడుదలలో జాప్యానికి కారణమంటున్నారు. ఈ విషయమై పాఠశాల విద్యా డెరైక్టర్ను వివరణ కోరగా, విద్యావలంటీర్లకు వేతనాలు అందడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు చర్యలు చేపడతామన్నారు. రెండ్రోజుల్లో సమస్యను పరిష్కరించాలని హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల విద్యాశాఖాధికారులకు ఆదేశాలిచ్చామని చెప్పారు.
వేతనాల కోసం ఎదురుచూపులు
Published Sat, Feb 13 2016 3:47 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ ఏంటి? ఫిజికల్ రిలేషన్ షిప్కు ఎందుకు తావులేదు?
సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్ పై తొలిసారి స్పందించిన అదితిరావు హైదరీ
సాక్షి కార్టూన్ 11-05-2024
చంద్రబాబు అండ్ కో దొంగ మాటలు..
చిక్కుల్లో హీరో శింబు.. కమల్ హాసన్ మూవీలో నటించడానికి వీల్లేదంటూ..
టీడీపీలో చేరి తండ్రి ఆశయాలను నీరుగార్చిన దద్దమ్మ..
‘వరుణ్ విషయంలో బీజేపీని సవాల్ చేయలేను’
సీఎం జగన్కు ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు?
నువ్వా నన్ను విమర్శిస్తావ్.. దేవినేని ఉమాకు అబ్బయ్య చౌదరి కౌంటర్
కూటమికి ప్రజలే గుణపాఠం చెబుతారు: సజ్జల రామకృష్ణా రెడ్డి
తప్పక చదవండి
- సీఎం జగన్కు ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు?
- టీ20లలో సరికొత్త చరిత్ర.. బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
- నీతో ప్రచారం చేస్తే నా ఓటమి ఖాయం... కేశినేని చిన్ని
- పశ్చిమలో వెంకన్న సైలెంట్.. అనుచరుల ఆగ్రహం
- కుప్పంలో టీడీపీ గూండాయిజం
- HYD: ఏపీకి క్యూ కట్టిన ప్రజలు.. పలుచోట్ల ట్రాఫిక్ జాం
- 'డబుల్ ఇస్మార్ట్' తర్వాత ఆ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న 'రామ్'
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement