సాక్షి కథనాలపై విచారణకు సిద్ధంగా లేం: కాలువ | Sakshi
Sakshi News home page

సాక్షి కథనాలపై విచారణకు సిద్ధంగా లేం: కాలువ

Published Tue, Mar 8 2016 3:07 AM

సాక్షి కథనాలపై విచారణకు సిద్ధంగా లేం: కాలువ - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో భూముల దురాక్రమణపై సాక్షి పత్రికలో వచ్చిన కథనాలపై విచారణకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ఏపీ ప్రభుత్వ చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సభ లోపల లేదా వెలుపల ఎక్కడైనా ప్రతిపక్ష నేత జగన్‌తో చర్చకు సిద్ధమని తెలిపారు.

సోమవారం ఆయన  ఎన్టీఆర్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎన్‌ఆర్‌ఐ వేమూరి రవికుమార్ చట్టప్రకారం సంపాదించిన డబ్బుతో 11 ఎకరాల భూమిని కొన్నారని, దానితో నారా లోకేశ్‌కు సంబంధం లేదన్నారు. వైఎస్సార్ సీపీ ఆరోపించిన నేతలంతా చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు.

Advertisement
Advertisement