'తెలంగాణ ఎంసెట్పై తేలుస్తాం' | Sakshi
Sakshi News home page

'తెలంగాణ ఎంసెట్పై తేలుస్తాం'

Published Tue, Jul 19 2016 12:48 PM

'తెలంగాణ ఎంసెట్పై తేలుస్తాం'

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్పై వస్తున్న ఫిర్యాదుల విషయంలో విచారణకు ఆదేశిస్తామని మంత్రి లక్ష్మా రెడ్డి హామీ ఇచ్చారు. అన్ని అనుమానాలను నివృత్తి చేస్తామని చెప్పారు. తెలంగాణ ఎంసెట్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.

ఏపీ ఎంసెట్లో వేలల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు తెలంగాణ ఎంసెట్లో మాత్రం వందల్లో ర్యాంకులు తెచ్చుకున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. కోచింగ్ సెంటర్లలో కూడా ప్రతిభ అంతతమాత్రమేనని తెలియడంతో తల్లిదండ్రులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆందోళనకు దిగారు. దీంతో అందరి అనుమానాలు నివృత్తి చేస్తామని లక్ష్మారెడ్డి చెప్పారు.
 

Advertisement
Advertisement