ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రజలు విశ్వసించారని... అందుకే ఆ పార్టీకి ఓటేశారని కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీచంద్ రెడ్డి మంగళవారం హైదరాబాద్లో అన్నారు. అదికాక తెలంగాణ ప్రజలు మార్పుకోరుకుని టీఆర్ఎస్ను గెలిపించారన్నారు.
అలాగే 10 ఏళ్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత కూడా ఉండి వచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి తమ వంతు సహకారం అందిస్తామని వంశీచంద్ స్పష్టం చేశారు. అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ఓడినందుకు కాంగ్రెస్ పార్టీ బాధపడాల్సిన అవసరం లేదని వంశీచంద్ రెడ్డి పేర్కొన్నారు.