- ఏర్పాటు చేసిన వాటిని తొలగిస్తున్నామంటే ఎలా?
- పాత వాటి స్థానంలో కొత్తవి పెట్టుకునేందుకే తొలగిస్తున్నట్లుంది
- వారికి జరిమానాలు ఎందుకు విధించడం లేదు
- కఠినంగా వ్యవహరిస్తేనే పరిస్థితులు దార్లోకొస్తాయి
- జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశం.. విచారణ 25కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: నగరంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, కటౌట్లను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) వాదనపై హైకోర్టు మండిపడింది. తొలగించిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసుకునే ందుకే ఉన్న వాటిని తొలగిస్తున్నట్లున్నారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేసిన వారికి ఎందుకు జరిమానా విధించడం లేదని ప్రశ్నించింది.
ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తేనే పరిస్థితులు దార్లోకి వస్తాయని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్న వారి పై ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ఆదేశిస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావుతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
నగరంలో నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని సోమవారం విచారించిన ధర్మాసనం.. ఓ నిర్ధిష్ట ప్రదేశంలో కాకుండా ఎక్కడపడితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని, చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది పి.కేశవరావు వాదనలు వినిపిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన 2,385 కటౌట్లు తొలగించామని చెప్పారు. దీనికి ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ.. తొలగిస్తున్నామని చెప్పడంలో ఏ మాత్రం అర్థం లేదని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరో ఏర్పాటు చేసిన వాటిని సొంత ఖర్చుతో తొలగించడంలో అర్థమేమిటని ప్రశ్నించింది. ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేసిన వారికి ఎందుకు జరిమానా విధించడం లేదని ప్రశ్నించింది. తమకు రోడ్డుపై ప్రతీ రోజూ లెక్కకు మించి ఫ్లెక్సీలు, హోర్డింగ్లు కనిపిస్తున్నాయని, ఓ నిర్ధిష్ట ప్రదేశంలో కాక ఇలా ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేయడం సరికాదని పేర్కొంది.
ఈ విషయాన్ని జీహెచ్ఎంసీకే పరిమితం చేయవద్దని, అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు వర్తింప చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న వారిపై తీసుకున్న చర్యలను వివరించాలని కేశవరావుకు స్పష్టం చేసింది. ఇందుకు ఆయన గడువును కోరడంతో ధర్మాసనం అందుకు అంగీకరిస్తూ విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.
ఫ్లెక్సీలు, హోర్డింగ్లపై ఏం చర్యలు తీసుకున్నారు
Published Tue, Jul 12 2016 3:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement