అయ్యిందేదో అయ్యింది.. ఇక సీరియస్‌గా పనిచేస్తా | Sakshi
Sakshi News home page

అయ్యిందేదో అయ్యింది.. ఇక సీరియస్‌గా పనిచేస్తా

Published Tue, Dec 8 2015 4:44 PM

అయ్యిందేదో అయ్యింది.. ఇక సీరియస్‌గా పనిచేస్తా - Sakshi

గత కొంతకాలంగా తాను పార్టీ కార్యక్రమాలను పట్టించుకోకపోవడం పొరపాటేనని కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ అంగీకరించారు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిందని.. ఇక మీదట పార్టీ కోసం సీరియస్‌గా పనిచేస్తానని నాయకులకు ఆయన చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది.

ఈ సన్నాహక సమావేశంలో దానం నాగేందర్ ఇతర సీనియర్ నాయకులకు ఇకపై గట్టిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. సేవ్ హైదరాబాద్ అనే నినాదంతో జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో దిగాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది.

Advertisement
Advertisement