హైదరాబాద్: ప్రముఖ పాత్రికేయుడు, కవి, విప్లవ స్ఫూర్తి ప్రదాత యాదాటి కాశీపతి(74) గురువారం హైదరాబాద్ గాంధీనగర్లోని ఆయన నివాసంలో కన్నుమూశారు. ఆయనకు భార్య పుష్పలత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాశీపతి గత 12 ఏళ్లుగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. పది రోజుల క్రితం బాత్రూమ్లో కిందపడగా తుంటి ఎముక విరిగిపోయింది. ముషీరాబాద్లోని కేర్ ఆస్పత్రిలో సర్జరీ అనంతరం సోమవారం డిశ్చార్జయ్యారు. గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వదిలి..
అనంతపురానికి చెందిన కాశీపతి చదువు పూర్తి చేసిన అనంతరం డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం వచ్చింది. కానీ విప్లవ నేత చండ్ర పుల్లారెడ్డి పిలుపు మేరకు విప్లవ ఉద్యమానికి అంకితమయ్యారు. 1967 నుంచి విప్లవ ఉద్యమంలో పని చేశారు. ఎమర్జెన్సీలో 21 నెలల పాటు ముషీరాబాద్ కారాగారంలో జైలు జీవితం గడిపారు. సీపీఐఎంఎల్ తరపున సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. శ్రీశ్రీకి అత్యంత ఆప్తుడు. 1978లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఉండే గిరిజన యువతిని పెళ్లి చేసుకున్నారు.
ప్రముఖుల సంతాపం..: విరసం నేత వరవరరావు, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ సెక్రటేరియట్ సభ్యుడు వేములపల్లి వెంకటరామయ్య, ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షులు రమ, విమల, అంబిక, ఎస్.ఎల్.పద్మ, అరుణ, ఐఎఫ్టీయూ నాయకులు అనురాధ, పీడీఎస్యూ నాయకులు గౌతమ్ ప్రసాద్, సత్య, వెంకట్ తదితరులు ఆయన భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.వెంకటేశ్వర్రావు, కె.గోవర్దన్, ప్రముఖ కవి నిఖిలేశ్వర్ సంతాపాన్ని తెలిపారు. కాగా, అమెరికాలో ఉన్న ఇద్దరు కుమార్తెలకు శనివారం తెల్లవారుజామున హైదరాబాద్కు చేరుకుంటున్నారు. వారు రాగానే అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు బంధువులు తెలియజేశారు.
వైఎస్ జగన్ సంతాపం
హైదరాబాద్: అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ పాత్రికేయుడు వై.కాశీపతి మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాశీపతి గొప్ప వక్త, మంచి రచయిత, అంతకు మించి గొప్ప విలువలు కలిగిన పాత్రికేయుడని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే కాశీపతి మృతిపై పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సంతాపం తెలిపారు.
విప్లవ స్ఫూర్తి ప్రదాత కాశీపతి కన్నుమూత
Published Fri, Aug 12 2016 4:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement