ఆనందాల సంవత్సరం కావాలి | Sakshi
Sakshi News home page

ఆనందాల సంవత్సరం కావాలి

Published Sat, Dec 31 2016 5:34 AM

ఆనందాల సంవత్సరం కావాలి - Sakshi

తెలుగు ప్రజలకు వైఎస్‌ జగన్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ 2017 అభివృద్ధి, ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.

క్యాలెండర్ల మార్పుతోపాటు 2017 సంవత్సరం తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో, దేశ ప్రజలందరి జీవితాల్లో మంచి మార్పులకు దారితీయాలని అభిలషించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. ఈ మేరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement