హైదరాబాద్: పోలవరం విషయంలో తెలంగాణను ప్రశ్నించే పరిస్థితి కూడా ఏపీ ప్రభుత్వానికి లేకుండా పోయిందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీలోని ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడారు.
'1650 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయని ఓవైపు చెబుతారు. 8 టీఎంసీల నీళ్లు తీసుకెళ్లామని మరోవైపు చెబుతారు. వరద నీళ్ల స్టోరేజి కోసమే పోలవరం కడుతున్నారు. అందుకే దాన్ని పోలవరం అంటారు. ఆ నీళ్లు నిల్వ చేసుకుంటే, తర్వాత నీళ్లు డైవర్ట్ చేయగలిగితే కృష్ణాకైనా, శ్రీశైలానికైనా ఇవ్వచ్చు. కానీ మీ పట్టిసీమలో స్టోరేజి అనేది లేదు. అదే మీరు చేస్తున్న అన్యాయం. పట్టిసీమ కోసం పోలవరం ప్రాజెక్టును కాంప్రమైజ్ చేస్తారు. చివరకు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నారు' అని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు.
మరోవైపు చేనేత కార్మికుల సమస్యలపై మాట్లాడుతూ చేనేత కార్మికులెవరికీ రుణాలు మాఫీ కాలేదని, సబ్సిడీలు అందడం లేదని అన్నారు. వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద రంగం చేనేత కార్మిక రంగమే అనే గుర్తు చేశారు. కానీ, వారి పరిస్థితి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దయనీయంగా మారిందని చెప్పారు.
రూ.110 కోట్లు చేనేత కార్మికులకు రుణమాఫీ చేశామంటున్నారని కానీ ఎక్కడా మాఫీ కాలేదని అన్నారు. ధర్మవరంలో 12మంది కార్మికులు చనిపోతే వాళ్లింటికి వెళ్లి బాధలు విన్నామని చెప్పారు. చేనేత కార్మికులంతా విలవిల్లాడుతుంటే, 22 వేలమందికి మాత్రమే రుణమాఫీ చేశాం, అంతటితో అయిపోయిందంటే ఎలా అని ప్రశ్నించారు. ఇలాంటి దారుణ పరిస్థితికి నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నట్లు వైస్ జగన్ చెప్పారు.
'బాబు.. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించగలవా?'
Published Tue, Mar 15 2016 10:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement