సీసీ రెడ్డికి వైఎస్ జగన్, విజయమ్మ నివాళి | Sakshi
Sakshi News home page

సీసీ రెడ్డికి వైఎస్ జగన్, విజయమ్మ నివాళి

Published Thu, Oct 9 2014 10:55 AM

ys jagan mohan reddy, ys vijayamma pays tributes to CC Reddy

హైదరాబాద్ : అనారోగ్యంతో మృతి చెందిన సీసీ రెడ్డి భౌతిక కాయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ గురువారం  నివాళులు అర్పించారు. అనంతరం వారు సీసీ రెడ్డి సతీమణి సుభద్రమ్మతో పాటు కుటుంబ సభ్యులను  పరామర్శించారు. సీసీ రెడ్డి భౌతికకాయాన్ని సందర్శనార్థం కేర్ ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో ఉంచారు.  అలాగే వివిధ పార్టీ నేతలు కూడా సీసీ రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కాగా సీసీ రెడ్డి అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం  మునిపల్లి మండలం గొర్రెగట్టు గ్రామం సమీపంలోని ఫాంహౌస్లో నిర్వహించనున్నారు.

Advertisement
Advertisement