రోజాకు వైఎస్ జగన్ పరామర్శ | Sakshi
Sakshi News home page

రోజాకు వైఎస్ జగన్ పరామర్శ

Published Sat, Dec 19 2015 12:15 PM

రోజాకు వైఎస్ జగన్ పరామర్శ - Sakshi

హైదరాబాద్: నిమ్స్లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే రోజాను వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. శనివారం పార్టీ ఎమ్మెల్యేలతో కలసి వైఎస్ జగన్ నిమ్స్కు వెళ్లారు. రోజాను పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఈ రోజు ఉదయం అసెంబ్లీకి వెళ్లిన రోజా పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో రోజా కిందపడిపోయారు. గాయపడిన రోజా స్పృహ కోల్పోయారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై వైఎస్ఆర్ సీపీ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు రోజాను నిమ్స్కు తరలించారు. నిమ్స్లో రోజాకు వైద్య పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు. ఆమె శరీరంపై గోళ్ల గాట్లు పడ్డాయని, వాంతులు చేసుకున్నారని తెలుస్తోంది. హై బీపీతో ఉన్న రోజాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement