హైదరాబాద్ : ఉభయ తెలుగు రాష్ట్రాలకు అభివృద్ధి పరంగా విఘ్నాలు తొలగిపోయి అన్నీ విజయాలే సిద్ధించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు.
సోమవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఆయన తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ... రెండు రాష్ట్రాల ప్రజలందరికీ విజయాలు చేకూర్చాలని వైఎస్ జగన్ మనసారా కోరుకున్నారు.
సోమవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఆయన తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ... రెండు రాష్ట్రాల ప్రజలందరికీ విజయాలు చేకూర్చాలని వైఎస్ జగన్ మనసారా కోరుకున్నారు.