వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఈ రెండేళ్ల పాలనపై ఆత్మవిమర్శ చేసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు లోటస్పాండ్లోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. త్రివర్ణపతాకాన్ని ఎగురవేసిన అనంతరం అమరవీరులకు నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం భారీ ప్రకటనలు గుప్పించి పలు పథకాలపై ప్రచారం చేసుకుందన్నారు. అందులో ఏ ఒక్కటి కూడా పూర్తి కాలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ 50% కూడా పూర్తికాకుండానే పూర్తి చేసినట్లు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రం ఏర్పడటం 60 ఏళ్ల ఆకాంక్ష అయితే.. ఇందుకు 1,100 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని అన్నారు.
తీరా చూస్తే 300 మందిని కూడా గుర్తించే పరిస్థితి లేదన్నారు. అమరులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తిస్తామన్నారని చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్, జె. మహేందర్రెడ్డి, మతిన్, బ్రహ్మానందరెడ్డి, విజయ్ప్రసాద్, రమా ఓబుల్రెడ్డి, వెల్లాల రాంమోహన్, గ్రేటర్ అద్యక్షుడు బొడ్డు సాయినాథ్రెడ్డి, రఘురాంరెడ్డి, మహిళా అధ్యక్షురాలు అంబికా సాగర్, సేవాదళ్ అధ్యక్షుడు బంగారు వెంకటరమణ, దుబ్బాక గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీలో చేరికలు: ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మతిన్ ఆధ్వర్యంలో సయ్యద్ నౌసల్, సయ్యద్ కరీం, చంద్రశేఖర్, సురేందర్, రోహిత్ తదితరులతో పాటు భారీ సంఖ్యలో యువకులు పార్టీలో చేరారు. వీరందరికీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు.
కేసీఆర్ ఆత్మవిమర్శ చేసుకోవాలి: గట్టు
Published Fri, Jun 3 2016 3:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో మహిళతో రొమాన్స్.. చాలా ఎగ్జైట్ అయ్యానన్న సోనాక్షి
‘రైతుల భూ డాక్యుమెంట్లను బుగ్గిపాలు చేసింది బాబేగా!’
ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరంగల్ను BRS, కాంగ్రెస్ బారి నుంచి కాపాడాలి: ప్రధాని మోదీ
కొవిషీల్డ్ వ్యాక్సిన్ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..
పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు
పవన్ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు?: పోసాని
ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయవచ్చు!
తప్పక చదవండి
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయవచ్చు!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement