మీ ఎన్నిక చారిత్రక విజయం కావాలి | Sakshi
Sakshi News home page

మీ ఎన్నిక చారిత్రక విజయం కావాలి

Published Sun, Jun 25 2017 1:17 AM

రామ్‌నాథ్‌ కోవింద్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి - Sakshi

రామ్‌నాథ్‌కు మా సంపూర్ణ మద్దతు: వైఎస్‌ జగన్‌  
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏ తరఫు రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎన్నిక చారిత్రక విజయంగా నిలిచి పోవాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శనివారం ఢిల్లీలో రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలసి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినం దించారు. రామ్‌నాథ్‌తో వైఎస్‌ జగన్‌ ఫోన్‌లో మాట్లాడా రు. ఆయనకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుం దని వైఎస్‌ జగన్‌ పునరుద్ఘాటించారు.

4న హైదరాబాద్‌కు కోవింద్‌
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ జూలై 4న హైదరాబాద్‌ రానున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోరేందుకు టీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం కానున్నారు. నెక్లెస్‌ రోడ్డులో ఉన్న జలవిహార్‌లో ఈ సమావేశం ఉండనున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement