Sakshi News home page

600 హామీల్లో ఒక్కటీ నెరవేరలేదు: భూమన

Published Sat, Jun 4 2016 1:01 PM

ysrcp leader bhumana fires on chandrababu

హైదరాబాద్: ఎన్నికల సమయంలో ప్రజలకు 600 వాగ్థానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఒక్క హామీ నెరవేర్చలేదని వెఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. ప్రజల  కడుపుమంట, ఆక్రోశం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల్లో వినిపించిందని తెలిపారు. చంద్రబాబు హామీల వల్ల జీవితాలు నాశనం అయ్యాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారన్నారు. ప్రజల తరపున ప్రశ్నించడమే వైఎస్ జగన్ చేసిన నేరమా అని భూమన ప్రశ్నించారు.

చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలను నెరవేరిస్తే వైఎస్ జగన్ ఇలా మాట్లాడేవారు కాదని భూమన తెలిపారు. సాక్షాత్తూ పిల్లనిచ్చిన మామపై చంద్రబాబు వేసిన చెప్పులు ఇంకా వైస్రాయ్ హోటల్ వద్దే ఉన్నాయని ఎద్దేవా చేశారు. కుట్ర, దగా, వంచన, అవినీతికి మారుపేరు చంద్రబాబు అని విమర్శించారు. చేసిన తప్పులకు గాను నవనిర్మాణ సంకల్ప దీక్షలో చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. పరిటాల రవి రాజకీయ భవిష్యత్తును నాశనం చేసింది చంద్రబాబే అని భూమన ఆరోపించారు.
 

Advertisement
Advertisement