Sakshi News home page

నౌక మునిగి 10మంది మత్స్యకారుల మృతి

Published Mon, Sep 28 2015 5:54 PM

10 fishermen dead in South African trawler tragedy Johannesburg

జోహెన్స్బర్గ్: దక్షిణాఫ్రికా సముద్ర తీరంలో చేపలవేటకు వెళ్లి 10 మంది మత్స్యకారులు మృతిచెందగా, ముగ్గురు గల్లంతైనట్టు దక్షిణాఫ్రికా రెస్క్యూ టీం పేర్కొంది. శిధిలావస్థకు చేరిన నౌకలో చేపల వేటకు వెళ్లడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపింది. గల్లంతైన వారిలో 9 మృతదేహాలు లభ్యం కాగా, ఒకరు తీవ్రగాయాలతో మృతిచెందినట్టు చెప్పారు.

మత్స్సకారుల నౌక 20 అడుగుల మేర నీరు లోపలికి వచ్చి బాగా ఉబ్బిపోవడంతో నౌక మునిగిపోయింది. దాంతో  వారు రక్షికదళానికి సమాచారం అందించారు. దాంతో స్పందించిన రక్షిక సహాయ బృందం, దక్షిణాఫ్రికా విమానాయన శాఖ హెలికాప్టర్ సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టింది. కాగా, పశ్చిమ భూభాగ ప్రాంతం నేషనల్ సీ రెస్య్కూ ఇన్స్టిట్యూట్ మరో ఎనిమిది మంది జాలర్లను రక్షించినట్టు వెల్లడించింది.

Advertisement

What’s your opinion

Advertisement